E-Paper
Advertisement

Dhurandhar 2: డ్రోన్ ఎఫెక్ట్.. చిక్కుల్లో ‘ధురందర్ 2’ చిత్ర బృందం.. అసలు విషయమిదే!

Dhurandhar 2: డ్రోన్ ఎఫెక్ట్.. చిక్కుల్లో ‘ధురందర్ 2’ చిత్ర బృందం.. అసలు విషయమిదే!
Advertisement

Dhurandhar 2: ఇటీవల వచ్చిన ‘ధురంధర్’ (Dhurandhar) చిత్రం బాలీవుడ్‌కు ఊపిరిపోసిన విషయం తెలిసిందే. ఫ్లాపులతో అల్లాడుతున్న బాలీవుడ్ ఇండస్ట్రీకి, రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టి.. కొత్త ఊపిరినిచ్చిందీ చిత్రం. రణవీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, సారా అర్జున్ వంటి వారు అసాధారణమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని, సరికొత్త రికార్డులకు నిలయంగా మారింది. మొదటి పార్ట్ ఘన విజయం సాధించడంతో, రెండో పార్ట్ (Dhurandhar 2) కోసం రెట్టింపు ఉత్సాహంతో టీమ్ పని చేస్తోంది. ఈ క్రమంలో ముంబైలోని హై-సెక్యూరిటీ జోన్‌లో షూటింగ్ చేయడంతో, ఈ చిత్ర బృందం ఇప్పుడు చిక్కుల్లో పడింది. ముంబైలోని హై సెక్యూరిటీ ప్రాంతమైన ఫోర్ట్ (Fort) ప్రాంతంలో ముందస్తు అనుమతి లేకుండా డ్రోన్‌ను ఉపయోగించినందుకు గానూ చిత్ర యూనిట్‌పై ముంబై పోలీసులు (Mumbai Police) చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. ఈ మేరకు చిత్ర లోకేషన్ మేనేజర్‌పై ఎఫ్ఐఆర్ నమోదైనట్లుగా తెలుస్తోంది.

Also Read- Jr NTR: ఎన్టీఆర్ పై పూజా బేడి కామెంట్స్.. మహిళల విషయంలో తారక్ అలాంటి నిర్ణయం తీసుకున్నారా?

అసలు విషయం ఏమిటంటే..

Advertisement

సౌత్ ముంబైలోని ఫోర్ట్ ప్రాంతం.. ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్థిక సంస్థలతో కూడిన హై-సెక్యూరిటీ జోన్. ఫిబ్రవరి 1వ తేదీన ఈ ప్రాంతంలో ‘ధురందర్ 2’ షూటింగ్ జరుగుతుండగా, చిత్ర బృందం ఏరియల్ షాట్స్ కోసం డ్రోన్‌ను గాలిలోకి ఎగురవేసింది. ఈ డ్రోన్ వాడటానికి సంబంధించి ఎలాంటి అధికారిక అనుమతులు చిత్రబృందం తీసుకోలేదని తేలడంతో ఎంఆర్ఏ మార్గ్ (MRA Marg) పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసుల చెబుతున్న కథనం ప్రకారం.. నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ లోకేషన్ మేనేజర్ రింకూ రాజ్‌పాల్ వాల్మీకి (Rinku Rajpal Valmiki)పై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 223 కింద కేసు నమోదు చేశారు. అధికార యంత్రాంగం జారీ చేసిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించారనే ఆరోపణల‌తో పోలీసులు ఈ FIR ను ఫైల్ చేశారు.

Also Read- Khushbu Sundar: మెగా, వెంకీ మ్యాజిక్‌కు ఖుష్బూ ఫిదా.. రివ్యూ చూశారా!

పాకిస్థాన్ వీధిగా మారిన ఫోర్ట్ ఏరియా

Advertisement

ఈ సినిమా కోసం జనవరి 30 నుంచి ఫోర్ట్ కాంప్లెక్స్‌లోని కొన్ని భాగాలను పాకిస్థాన్‌లోని పాత వీధులను తలపించేలా భారీ సెట్టింగ్‌లతో మార్చేశారు. ఈ మార్పులు అటు స్థానికులను, ఇటు భద్రతా సిబ్బందిని ఆకర్షించాయి. షూటింగ్ మూడవ రోజైన ఫిబ్రవరి 1న సంజయ్ దత్‌తో సహా చిత్ర బృందం మొత్తం సెట్స్‌లో ఉండగా, డ్రోన్ వాడకం భద్రతా పరమైన ఆందోళనలకు దారితీసింది. డ్రోన్ వినియోగాన్ని గుర్తించిన వెంటనే పోలీసులు లోకేషన్ మేనేజర్‌కు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతోంది. ముంబై వంటి నగరాల్లో, ముఖ్యంగా రక్షణ పరంగా సున్నితమైన ప్రాంతాల్లో డ్రోన్లను ఎగురవేయాలంటే కచ్చితమైన ప్రోటోకాల్ పాటించాలని పోలీసులు స్పష్టం చేశారు. అనుమతి లేకుండా రికార్డింగ్ పరికరాలు వాడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రస్తుతానికైతే ఈ కేసులో ఎలాంటి అరెస్టులు జరగలేదని తెలుస్తోంది. కానీ, షూటింగ్ నిమిత్తం భారీ సెట్లు వేసినప్పుడు, ఆధునిక పరికరాలు వాడేటప్పుడు చిత్ర నిర్మాణ సంస్థలు మరింత బాధ్యతగా వ్యవహరించాలని ఈ ఘటన తెలియజేస్తోంది.

Also Read- The Paradise: తలకు మించిన భారాన్ని నెత్తిపై వేసుకుంటున్న నాని..!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×