E-Paper
Advertisement

Devi Sri Prasad: సుకుమార్ డైరెక్షన్ లో దేవి శ్రీప్రసాద్.. చివరి క్షణంలో ఆగిపోయిన సినిమా?

Devi Sri Prasad: సుకుమార్ డైరెక్షన్ లో దేవి శ్రీప్రసాద్.. చివరి క్షణంలో ఆగిపోయిన సినిమా?
Advertisement

Devi Sri Prasad: రాక్ స్టార్ దేవిశ్రీపసాద్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. సంగీత దర్శకుడిగా తన మ్యూజిక్ తోనే మ్యాజిక్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా సంగీత దర్శకుడిగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న దేవిశ్రీప్రసాద్ త్వరలోనే వెండితెరపై హీరోగా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈయన వేణు వెల్దండి దర్శకత్వంలో రాబోతున్న ఎల్లమ్మ సినిమాలో హీరోగా నటించబోతున్నారు.

సుకుమార్ డైరెక్షన్లో హీరోగా దేవిశ్రీ..

ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం షూటింగ్ పనులలో చిత్ర బృందం ఎంతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల దేవిశ్రీప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. తాను ఎల్లమ్మ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాను కానీ నిజానికి సుకుమార్ డైరెక్షన్లోనే తాను హీరోగా ఓ సినిమాలో చేయాల్సి ఉండేదని తెలిపారు. సుకుమార్ గారు ఒక కథ తనకు చెప్పారని ఆ కథ అద్భుతంగా నచ్చిందని ఈ ప్రాజెక్టుకు తాను ఓకే చెప్పానని తెలిపారు.

దేవి శ్రీ ప్రసాద్ తండ్రి మరణం..

Advertisement

ఇలా ఈ ప్రాజెక్టు అనుకున్న సమయంలోనే మా తండ్రిగారు చనిపోవడంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని లేకపోతే తాను సుక్కు గారి డైరెక్షన్లోనే హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యేవాన్ని అంటూ దేవి శ్రీ ప్రసాద్ తెలియజేశారు. కేవలం సుకుమార్ గారు మాత్రమే కాకుండా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ హరీష్ శంకర్ అలాగే దిల్ రాజు వంటి వారు తనని నటన విషయంలో ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటారని దేవి శ్రీ ప్రసాద్ తెలియజేశారు. మరి వీరి కాంబినేషన్లో రావాల్సిన సినిమాని పూర్తిగా పక్కన పెట్టారా లేదంటే మరి ఇతర హీరోతోనైనా చేశారా అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

దసరా బరిలో ఎల్లమ్మ..

Advertisement

ఇలా ఈ సినిమా మిస్ కావడంతో దేవిశ్రీప్రసాద్ పలు సినిమాలకు సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు. ఇక ఈయనకు చివరికి ఎల్లమ్మ (Yellamma)సినిమాలో నటించే అవకాశం లభించింది. ఈ సినిమా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని స్పష్టమవుతుంది .సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ విడుదల చేశారు. ఈ వీడియోలో దేవి శ్రీ ప్రసాద్ పస్ట్ లు కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. బలగం లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత రాబోతున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. మరి హీరోగా దేవిశ్రీ ప్రసాద్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాను 2026 దసరా పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది.

Also Read: Anil Ravipudi: అనిల్ రావిపూడి సినిమా నుంచి ఫహద్ ఔట్…రంగంలోకి మరోస్టార్ హీరో?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×