E-Paper
Advertisement

Jayashankarr: మూల స్తంభాలను కోల్పోయాను.. అనసూయ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్

Jayashankarr: మూల స్తంభాలను కోల్పోయాను.. అనసూయ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్
Advertisement

Jayashankarr: టాలీవుడ్ దర్శకుడు జయశంకర్ (Jayashankarr)తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అరి సినిమా(Ari Movie)  దర్శకుడిగా జయశంకర్ అందరికీ ఎంతో సుపరిచితమే. గత ఏడు సంవత్సరాల క్రితం ప్రకటించిన ఈ సినిమా కొన్ని కారణాలవల్ల కార్యరూపం దాల్చలేదు. ఇలా ఏడు సంవత్సరాల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో డైరెక్టర్ జయశంకర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఎన్నో అడ్డంకులను అవాంతరాలను ఎదుర్కొంటూ అరి సినిమా అక్టోబర్ పదవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమా వారిద్దరికీ అంకితం..

ఈ సందర్భంగా డైరెక్టర్ జయశంకర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ..” రేపటి నుంచి ఈ అరి సినిమా ప్రేక్షకులదని తెలిపారు. ఈ ప్రయాణంలో ఈ చిత్రం నాకు ఎప్పుడూ ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోతుంది. ఈ సినిమా ప్రయాణంలో నా తండ్రిని అలాగే నా బావను నేను కోల్పోయాను. నా జీవితంలో వీరిద్దరూ రెండు స్తంభాలు లాంటివారు. ఈ రెండు స్తంభాలను తాను కోల్పోయాను. ఈ సినిమా ప్రతి ఫ్రేమ్ వారి ఆశీర్వాదాలను నా బాబోద్వేగాలను కలిగి ఉంటుందని వెల్లడించారు. ఈ సినిమా కోసం నేను పడిన ఈ కష్టాన్ని, వారి ప్రేమ, జ్ఞాపకాలకు అంకితం చేస్తున్నాను” అంటూ ఈ సందర్భంగా జయశంకర్ చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

హిమాలయాలకు వెళ్లిన డైరెక్టర్..

Advertisement

ఈ విధంగా సినిమా మరికొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో దర్శకుడు తన తండ్రి, బావను కోల్పోయాను అంటూ ఈ సందర్భంగా వెల్లడించడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఇక జయశంకర్ ఇదివరకు పేపర్ బాయ్ అనే సినిమాకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కూడా ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ఇక అరి సినిమా విషయానికి వస్తే.. వినోద్ వర్మ (Vinod Varma) అనసూయ భరద్వాజ్ (Anasuya Bhardwaj)ప్రధాన పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమాలో నటుడు సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కూడా కీలక పాత్రలు పోషించారు.

Advertisement

ఇక ఈ సినిమా ప్రకటించి దాదాపు ఏడు సంవత్సరాలకు విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ఆలస్యానికి గల కారణాలను వివరించారు. ఈ సినిమా ప్రకటించిన తర్వాత ఈయన హిమాలయాలకు వెళ్లి అక్కడ ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులను కూడా కలిసినట్టు తెలిపారు. ఈ సినిమా కోసమే ఆయన హిమాలయాలకు వెళ్లడంతో ఇంత ఆలస్యమైందని తెలియజేశారు. ఇలా ఏడు సంవత్సరాల తర్వాత ఈ సినిమా రేపు విడుదల కాబోతున్న నేపథ్యంలో ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుంది ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Mohan lal: మోహన్ లాల్ వృషభ రిలీజ్ డేట్ లాక్.. ఓకే ఏడాదిలో 5 సినిమాలు రిలీజ్..చూసి నేర్చుకోండయ్యా!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×