E-Paper
Advertisement

Rajinikanth: 37 ఏళ్ల తర్వాత విడుదలకు రజనీకాంత్ మూవీ.. వాయిదా వెనుక కారణం?

Rajinikanth: 37 ఏళ్ల తర్వాత విడుదలకు రజనీకాంత్ మూవీ.. వాయిదా వెనుక కారణం?
Advertisement

Rajinikanth:సాధారణంగా కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని.. విడుదల కావాల్సిన సమయంలో కొన్ని అనివార్య కారణాలవల్ల వాయిదా పడుతూ ఉంటాయి. కానీ అనుకోని సందర్భాలలో మళ్ళీ సడన్గా థియేటర్లలోకి వస్తే మాత్రం అభిమానులు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఈ క్రమంలోనే గతంలో హీరో విశాల్ (Vishal) హీరోగా నటించిన ‘మదగజ రాజా’ ఏకంగా 12 ఏళ్ల తర్వాత విడుదలై థియేటర్లలో మంచి విజయం సాధించింది . అయితే ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) కూడా దాదాపు 37 ఏళ్ల క్రితం నటించిన ఒక సినిమా విడుదలకు నోచుకోలేదు. కానీ ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతుండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ చిత్రం ఏమిటి? ఎందుకు ఇన్ని రోజులు ఆగిపోయింది? అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.

37 ఏళ్ల తర్వాత విడుదలకు నోచుకుంటున్న రజనీకాంత్ మూవీ..

1989లోనే సూపర్ స్టార్ రజినీకాంత్ ఒక బాలీవుడ్ యాక్షన్ ఫిలింలో నటించారు . షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది ఆ సినిమా.. కానీ కొన్ని కారణాలవల్ల ఆ సినిమా తెరపైకి రాలేదు. అయితే ఇప్పుడు ఏకంగా 4K టెక్నాలజీతో.. ఏఐ ని ఉపయోగించి థియేటర్లలోకి రావడానికి సిద్ధమయ్యింది ముఖ్యంగా టాప్ స్టార్ లందరూ ఇందులోనే నటించారు. మరి అలాంటి ఈ సినిమా విడుదలకు ఇన్నేళ్లు పట్టడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి ఆ చిత్రం ఏదో కాదు “హమ్ మీన్ షాహేన్ షా కౌన్”. ప్రముఖ నిర్మాత రాజా రాయ్ అప్పట్లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో రజినీకాంత్ తో పాటు హేమమాలిని, అనితా రాజ్ , ప్రేమ్ చోప్రా, శరత్ సక్సేనా, శత్రుజ్ఞ సిన్హా, అమ్రీష్ పూరి, జగదీప్ లాంటి తదితరులు నటించారు.

Advertisement

also read:Hyper Aadi: “ఐడియల్ భర్త”.. అలాంటి లక్షణాలు కావాలంటున్న హైపర్ ఆది!

అందుకే ఇన్ని రోజులు విడుదల కాలేదు..

ఇక్కడ మరో బాధాకరమైన విషయం ఏమిటంటే.. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన హర్మేష్ మల్హోత్రాతో పాటు విలక్షణ నటుడు అమ్రిష్ పూరి , హాస్యనటుడు జగదీప్, కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ వంటి దిగ్గజాలు మన మధ్య లేకపోవడం గమనార్హం.ఇకపోతే దాదాపు 37 ఏళ్లుగా వాయిదా పడ్డ ఈ సినిమా ఎందుకు విడుదల కాలేదనే విషయానికి వస్తే..వ్యక్తిగత కారణాలే అని తెలుస్తోంది.నిర్మాత రాజా రాయ్ తన వ్యాపార పనిపై లండన్ వెళ్లిపోయారట. అక్కడ ఆయన చిన్న కుమారుడు అకస్మాత్తుగా మరణించడంతోనే తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన ఆయన ఆ సినిమాను మళ్ళీ పట్టించుకోలేదు. అయితే కొంతకాలం ఆ బాధలోనే ఉన్న ఆయన మళ్లీ సినిమాను విడుదల చేద్దామని అనుకుంటున్న సమయంలో దర్శకుడు హర్మేశ్ మల్హోత్రా కన్నుమూశారు. అదొక విషాదఘటన.ఇలా వరుసగా విషాదాలు ఏర్పడుతున్న నేపథ్యంలోనే ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది.

అస్లాం మిర్జా సహకారంతో విడుదలకు సిద్ధం..

Advertisement

ఇక ఇన్నేళ్ళకు సహ నిర్మాత అస్లాం మిర్జా సహాయంతో పిక్చర్ క్వాలిటీ కోసం 4k టెక్నాలజీని.. ఆడియో నాణ్యత కోసం ఏ ఐ టెక్నాలజీని ఉపయోగించి కథలో మార్పులు చేయకుండా ఆ కాలంనాటి కలర్ విజువల్స్ దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పుడు విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నారు. అంతేకాదు ఇందుకు సంబంధించిన అఫీషియల్ డేట్ ను కూడా త్వరలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఇన్నేళ్ల తర్వాత రజనీకాంత్ నటించిన ఈ సినిమా విడుదల కాబోతుండడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి.

రజనీకాంత్ ప్రస్తుత సినిమాలు..

ఇక అలాగే మరొకవైపు రజినీకాంత్ జైలర్ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అలాగే రాజ్ కమల్ ఫిలిమ్స్ బ్యానర్ పై కమలహాసన్ నిర్మిస్తున్న తలైవార్ 176 సినిమా షూటింగ్లో బిజీగా కానున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×