E-Paper
Advertisement

Summer Diet Alert: ఎండ దెబ్బ నుంచి తప్పించుకోవాలంటే.. వీటిని వదిలేయాల్సిందే!

Summer Diet Alert: ఎండ దెబ్బ నుంచి తప్పించుకోవాలంటే.. వీటిని వదిలేయాల్సిందే!
Advertisement

Summer Diet Alert: ఎండలు మండిపోతున్న వేళ కేవలం బయట తిరగడమే కాదు. మనం తినే ఆహారం కూడా మన శరీర ఉష్ణోగ్రతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వేసవిలో జీర్ణక్రియ మందగించడం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు సర్వసాధారణం. కొన్ని రకాల ఆహార పదార్థాలు శరీరంలో వేడిని పెంచి, అసౌకర్యానికి గురి చేస్తాయి. అందుకే.. ఈ వేసవి తాపం నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే.. మన డైట్ నుంచి కొన్ని పదార్థాలను పక్కన పెట్టడం అత్యవసరం.

వేసవిలో ఈ 7 ఆహారాలకు దూరంగా ఉండండి!
వేసవి కాలం రాగానే మన శరీరం సహజంగానే చల్లదనాన్ని కోరుకుంటుంది. కానీ.. మనకు తెలియకుండానే.. మనం తీసుకునే కొన్ని ఆహారాలు శరీరంలో ‘థర్మోజెనిసిస్’ను పెంచుతాయి. దీని వల్ల చెమట పట్టడం, కడుపులో మంట, నీరసం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ ఎండల నుంచి ఉపశమనం పొందాలంటే.. ఈ కింది 7 రకాల ఆహారాలను నివారించడం ఉత్తమం.

Advertisement

1. అధికంగా ఉండే మసాలాలు:
మసాలా దినుసులలో ఉండే ‘క్యాప్సైసిన్’ అనే పదార్థం శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఇది జీవ క్రియను వేగవంతం చేసినప్పటికీ.. వేసవిలో విపరీతమైన చెమట పట్టడానికి, కడుపులో అసౌకర్యానికి దారి తీస్తుంది. మిరప పొడి, గరం మసాలా వంటి వాటిని ఈ సీజన్‌లో పరిమితం చేయడం మంచిది.

2. వేయించిన పదార్థాలు:
నూనెలో వేయించిన సమోసాలు, పకోడీలు, బర్గర్లు వేసవిలో జీర్ణం కావడం చాలా కష్టం. వీటిలో ఉండే కొవ్వు పదార్థాలు శరీరంలో వేడిని పెంచుతాయి. అలాగే.. ఇవి చర్మంలో నూనె ఉత్పత్తిని పెంచి మొటిమలకు కారణమవుతాయి. వీటి బదులు ఆవిరిపై ఉడికించిన పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వండి.

Advertisement

3. కెఫిన్ అధికంగా ఉండే డ్రింక్స్:
చాలా మందికి వేడి వేడి కాఫీ లేదా టీ తాగనిదే రోజు గడవదు. కానీ కెఫిన్ ఒక ‘డైయూరిటిక్’. అంటే.. ఇది మీ శరీరం నుంచి నీటిని త్వరగా బయటకు పంపేలా చేస్తుంది. దీని వల్ల డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది. వేసవిలో వీటిని తగ్గించి మజ్జిగ లేదా కొబ్బరి నీళ్లు తీసుకోవడం ఉత్తమం.

4. నాన్ వెజ్ :
రెడ్ మీట్ (మటన్) , చికెన్ జీర్ణం కావడానికి శరీరం ఎక్కువ శక్తిని వెచ్చించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. వేసవిలో మాంసాహారం తీసుకోవడం వల్ల శరీరంలో వేడి అధికమై జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. వీలైతే.. వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే పరిమితం చేయండి.

5. మామిడి పండ్లు:
మామిడి పండ్లను ‘ఫలరాజు’ అని పిలుస్తాము. కానీ ఇవి శరీరంలో వేడిని కలిగిస్తాయి. అతిగా మామిడి పండ్లు తినడం వల్ల కొందరికి ఒంటిపై సెగ గడ్డలు వచ్చే అవకాశం ఉంది. వీటిని తినే ముందు కనీసం గంట సేపు నీటిలో నాన బెట్టడం వల్ల వాటిలోని వేడి తగ్గుతుంది.

6. ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలు:
చిప్స్, పచ్చళ్ళు, ప్యాక్ చేసిన స్నాక్స్‌లో ఉప్పు (సోడియం) అధికంగా ఉంటుంది. సోడియం శరీరంలోని నీటిని గ్రహిస్తుంది. దీని వల్ల కణాలు డీహైడ్రేషన్‌కు గురవుతాయి. వేసవిలో ఉప్పును ఎంత తగ్గిస్తే అంత మంచిది.

Also Read: బట్టలపై కాఫీ,టీ మరకలా ? కంగారు పడకండి.. చిటికెలో మాయం చేసే చిట్కాలివిగో

7. ఐస్ క్రీములు, కూల్ డ్రింక్స్:
ఇది వినడానికి వింతగా అనిపించవచ్చు..కానీ ఐస్ క్రీములు తిన్నప్పుడు శరీరానికి తాత్కాలికంగా చల్లదనం లభించినా.. అవి జీర్ణమయ్యే క్రమంలో శరీర ఉష్ణోగ్రత మళ్ళీ పెరుగుతుంది. కూల్ డ్రింక్స్‌లోని చక్కెర స్థాయిలు కూడా శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయి. వీటికి బదులు సహజమైన పండ్ల రసాలు ఉత్తమం.

వేసవిలో ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మసాలాలు, నూనె పదార్థాలకు దూరంగా ఉంటూ.. నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కీరా, పెరుగు వంటి పదార్థాలను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా ఈ సమయాన్ని హాయిగా గడపవచ్చు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×