E-Paper
Advertisement

No Snacks After 6pm: సాయంత్రం ఆరు గంటల తరువాత ఈ ఫుడ్స్ తినడం ప్రమాదం

No Snacks After 6pm: సాయంత్రం ఆరు గంటల తరువాత ఈ ఫుడ్స్ తినడం ప్రమాదం
Advertisement

సాయంత్ర అయిందంటే చాలామందికి ఏదైనా స్నాక్స్ తినాలనే కోరిక కలుగుతుంది. పని అలసట తర్వాత టీతో పాటు సమోసా, పకోడీ, చాట్ లాంటి స్నాక్స్ తినడం అలవాటుగా మారింది. కానీ వైద్యులు చెబుతున్న ప్రకారం సాయంత్రం 6 గంటల తర్వాత కొన్ని ఆహారాలు తినడం వల్ల రాత్రంతా గ్యాస్, కడుపు ఉబ్బరం, అసౌకర్యం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో శరీరం నిద్రకు సిద్ధమవుతుంది. జీర్ణక్రియ వేగం కూడా తగ్గుతుంది. అప్పుడు భారమైన ఆహారం తింటే అది సులువుగా జీర్ణం కాక సమస్యలు పెరుగుతాయి. అందుకే సాయంత్రం వేళ ఏమి తినాలి, ఏమి తినకూడదు అన్న విషయంపై అవగాహన అవసరం.

వీటిని తగ్గిస్తే మంచిది
వీధి ఆహారం సాయంత్రం సమయంలో ఎక్కువగా ఆకర్షిస్తుంది. సమోసా, వడ, పకోడీ, పానీపూరి, చాట్, వడపావ్ లాంటి పదార్థాలు ఎక్కువ నూనెతో తయారవుతాయి. ఇవి కడుపులో జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. ఫలితంగా గ్యాస్ సమస్య పెరుగుతుంది. కొందరికి రాత్రి నిద్రలో కూడా కడుపు నొప్పి వస్తుంది. ఇలాంటి ఆహారాలలో ఉప్పు, మసాలా ఎక్కువగా ఉండటం వల్ల కడుపు మంట పెరుగుతుంది. తరచుగా ఇలా తింటే అజీర్ణ సమస్య అలవాటుగా మారే అవకాశం ఉంటుంది. బయట తయారయ్యే స్నాక్స్ పరిశుభ్రత కూడా సందేహాస్పదంగా ఉంటుంది.

Advertisement

తీపి పదార్థాలు వద్దు
సాయంత్రం వేళ తీపి పదార్థాలు తినడం కూడా మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. జిలేబీ, గులాబ్ జామూన్, కేకులు, బిస్కెట్లు లాంటి వాటిలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని ఒక్కసారిగా పెంచుతాయి. దాంతో పాటు కడుపులో గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. చాక్లెట్లు ఎక్కువగా తినడం వల్ల కూడా కడుపు బరువుగా అనిపిస్తుంది. సాఫ్ట్ డ్రింక్స్ తాగడం అలవాటు ఉన్నవారిలో గ్యాస్ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పానీయాల్లో గాలి ఎక్కువగా ఉండటం వల్ల కడుపు ఉబ్బరం పెరుగుతుంది.

వీటిని తినండి
సాయంత్రం వేళ తేలికపాటి ఆహారం తీసుకోవడం శరీరానికి మేలు చేస్తుంది. ఉడికించిన శెనగలు, మరమరాలు, పాప్ కార్న్ లాంటి స్నాక్స్ తీసుకోవచ్చు. ఇవి కడుపుకు భారంగా ఉండవు. పండ్లు తినడం కూడా మంచి ఎంపిక. ఆపిల్, బొప్పాయి లాంటి పండ్లు జీర్ణక్రియకు సహాయపడతాయి. ఒక గ్లాస్ గోరువెచ్చని పాలు తాగితే కూడా ఆకలి తగ్గుతుంది. గ్రీన్ టీ లాంటి పానీయాలు కడుపును ప్రశాంతంగా ఉంచుతాయి. సాయంత్రం వేళ ఎక్కువగా తినకుండా తక్కువ పరిమాణంలో తినడం అలవాటు చేసుకోవాలి.

Advertisement

సాయంత్రం ఆహారపు అలవాట్లు మార్చుకుంటే రాత్రి నిద్ర కూడా ప్రశాంతంగా ఉంటుంది. భోజనం చాలా ఆలస్యంగా చేయకపోవడం మంచిది. సాయంత్రం తిన్న ఆహారం జీర్ణం కావడానికి కనీసం రెండు గంటల సమయం ఇవ్వాలి. తిన్న వెంటనే పడుకోకుండా కొద్దిసేపు నడవడం మంచిది. రోజంతా సరిపడా నీరు తాగడం వల్ల కూడా గ్యాస్ సమస్య తగ్గుతుంది. చిన్న చిన్న మార్పులు చేస్తే పెద్ద ఆరోగ్య సమస్యలను దూరం పెట్టవచ్చు. సాయంత్రం తినే ఆహారంపై శ్రద్ధ పెట్టడం ఆరోగ్యకరమైన జీవనానికి మంచి ఆరంభం అవుతుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×