E-Paper
Advertisement

Navratri Celebration: ఆఫీసులో దేవీ నవరాత్రులు.. ఇలా జరుపుకుంటే ఎప్పటికీ మరచిపోలేరు

Navratri Celebration: ఆఫీసులో దేవీ నవరాత్రులు.. ఇలా జరుపుకుంటే ఎప్పటికీ మరచిపోలేరు
Advertisement

Navratri Celebration: హిందూ సంస్కృతిలో పండుగలు కేవలం ఆధ్యాత్మిక వేడుకలు మాత్రమే కాదు, ప్రజలందరినీ ఒకచోట చేర్చే సామాజిక ఉత్సవాలు కూడా. దసరా లేదా నవరాత్రి పండుగ మన దేశంలో అత్యంత ఘనంగా జరుపుకునే పండుగలలో ఒకటి. చాలా మంది ఇళ్లలో ఈ సమయంలో దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తారు. ఇదిలా ఉంటే.. ఉద్యోగులంతా కలిసి పనిచేసే ఆఫీసుల్లో, వివిధ సంస్కృతులు, ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు ఒక కుటుంబంలా పంగడను జరుపుకుంటారు. పని చేసే చోట నవరాత్రి పంగడను జరుపుకోవడం ద్వారా ఉద్యోగులలో ఉత్సాహం, ఆనందం, స్ఫూర్తి పెరుగుతాయి. ఇది కేవలం పండుగ వేడుక మాత్రమే కాదు.. ఉద్యోగుల మధ్య పరస్పర సంబంధాలను, సంతోషకరమైన వాతావరణాన్ని పెంపొందించే గొప్ప అవకాశం కూడా.

ఆఫీసులో నవరాత్రి ఉత్సవాలు ఎలా జరుపుకోవాలి ?
డ్రెస్ కోడ్ థీమ్: నవరాత్రి సమయంలో తొమ్మిది రోజులు దుర్గాదేవి తొమ్మిది రూపాలను పూజిస్తారు. ప్రతి రోజు ఒక ప్రత్యేకమైన రంగు ఉంటుంది. ఈ రంగులను అనుసరించి ప్రతి రోజు ఒక డ్రెస్ కోడ్ థీమ్ నిర్వహించవచ్చు. ఉదాహరణకు.. మొదటి రోజు ఆరెంజ్, రెండో రోజు తెలుపు ఇలా. ఉద్యోగాలను డ్రెక్ కోడ్ పాటించమని చెప్పాలి. ఇది ఉద్యోగులలో ప్రత్యేకమైన ఉత్సాహాన్ని నింపుతుంది. సాంప్రదాయ దుస్తులు ధరించడం వల్ల కూడా ఆఫీసుల్లో వాతావరణం పండుగ కళతో ఉట్టిపడుతుంది.

Advertisement

గర్భా, దాండియా నైట్: నవరాత్రి వేడుకలలో గర్భా, దాండియా వంటివి ప్రధానమైనవి. ఆపీసుల్లోని విశాలమైన హాలులో లేదా క్యాంటీన్‌లో ఒక రోజు సాయంత్రం సమయంలో వీటి కోసం ఏర్పాట్లు చేయండి. ఉద్యోగులందరూ వారి కుటుంబాలతో కలిసి పాల్గొనేందుకు అవకాశం ఇవ్వండి. దీనివల్ల వృత్తిపరమైన సంబంధాలు దాటి వ్యక్తిగత బంధాలు కూడా పటిష్ఠమవుతాయి.

బొమ్మల ప్రదర్శన (బొమ్మల కొలువు): నవరాత్రి సమయంలో బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం అనేది సంప్రదాయం. ఆఫీసుల్లో ఒక మూలలో అందమైన బొమ్మల కొలువు ఏర్పాటు చేయవచ్చు. ఉద్యోగులను కూడా వారి ఇళ్లలోని బొమ్మలను తీసుకువచ్చి ప్రదర్శించమని ప్రోత్సహించండి. ఇది అందరినీ ఆకట్టుకునే ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుంది.

Advertisement

ప్రసాదం, ప్రత్యేక వంటకాలు: నవరాత్రి సమయంలో ప్రసాదాల మార్పిడి అనేది సాధారణం. ప్రతి రోజు ఒక ఉద్యోగి లేదా టీమ్ కు సంబంధించి వారి ప్రాంతీయ సంప్రదాయానికి చెందిన ప్రసాదాన్ని తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించవచ్చు. తర్వాత ప్రసాదాన్ని అందరితో పంచుకోవాలి. అలాగే, క్యాంటీన్లో పండగ సందర్భంగా ప్రత్యేకమైన వంటకాలను కూడా ఏర్పాటు చేయవచ్చు.

పూజ, భజన కార్యక్రమాలు: ఆపీసులో ఒక చిన్న పూజ కార్యక్రమాన్ని కూడా నిర్వహించవచ్చు. దుర్గాదేవి పూజ, భజనలు నిర్వహించడం ద్వారా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. ఇది సానుకూల శక్తిని నింపడమే కాక, ఉద్యోగులలో మనశ్శాంతిని కూడా కలిగిస్తుంది.

Also Read: దుర్గాదేవిని ఈ ఎర్రటి పూలతో పూజిస్తే.. కష్టాలన్నీ తొలగిపోతాయ్ !

పండుగ వేడుకల ప్రయోజనాలు:
ఆఫీసులో పండుగలు జరుపుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

ఆఫీస్ సంస్కృతి మెరుగుపడుతుంది: ఇలాంటి ఉత్సవాలు ఉద్యోగుల మధ్య సమైక్యతను, పరస్పర గౌరవాన్ని పెంపొందిస్తాయి.

పని ఒత్తిడి తగ్గుతుంది: పండుగ వాతావరణం ఉద్యోగులకు పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతే కాకుండా వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.

సృజనాత్మకతకు ప్రోత్సాహం: సాంప్రదాయ దుస్తుల థీమ్, బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు ఉద్యోగులలో సృజనాత్మకతను వెలికితీస్తాయి.

ఆఫీసుల్లో నవరాత్రి వేడుకలను జరుపుకోవడం అనేది కేవలం ఒక సంప్రదాయాన్ని పాటించడం మాత్రమే కాదు, సంస్థలోని ఉద్యోగులందరినీ ఒక కుటుంబంలా కలిపి ఉంచే ఒక మార్గం. ఇది ఉద్యోగులలో ఆనందాన్ని, స్ఫూర్తిని నింపి, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన ఆఫీస్ వాతావరణానికి దారితీస్తుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×