E-Paper
Advertisement

Cucumber: కీర దోసకాయను ఈ ఆహారాలతో కలిపి తినొద్దు.. తర్వాత మీరే బాధపడతారు

Cucumber: కీర దోసకాయను ఈ ఆహారాలతో కలిపి తినొద్దు.. తర్వాత మీరే బాధపడతారు
Advertisement

ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో కీరా దోసకాయ ముందు స్థానంలో ఉంటుంది. వేసవిలో వీటిని అధికంగా తింటారు. వీటి అమ్మకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. దీనిలో 90 శాతం నీరే ఉంటుంది. కాబట్టి వేసవిలో కీరా దోసకాయ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా అధికంగానే ఉంటాయి. అయితే కీరా దోసకాయను సలాడ్ల రూపంలో, సాండ్‌విచ్‌లో భాగంగా చేసుకుంటారు. ఎక్కువమంది కొన్ని రకాల ఆహారాలతో కీరాదోసను కలపడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి ఆహారాలతో కీరా దోసతో కలపకూడదు తెలుసుకోండి.

పెరుగు
చాలామంది పెరుగులో కీరా దోస ముక్కలు వేసుకుని తినేందుకు ప్రయత్నిస్తారు. ముఖ్యంగా వేసవిలో చల్లని పెరుగులోకి ముక్కలు వేసుకుని తింటే ఎంతో హాయిగా ఉంటుంది. నిజానికి ఈ రెండింటినీ ఆరోగ్యకరం కాదు. దోసకాయలలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది పెరుగును నీరుగా మార్చడానికి కారణం అవుతుంది. పెరుగుకు ఉండే మృదువైన క్రీమీ ఆకృతి దెబ్బతింటుంది. కాబట్టి పాల ఉత్పత్తుల్లో దోసకాయను జతచేసి తినకూడదు. మీకు ఏదైనా పెరుగులో వేసుకుని తినాలనిపిస్తే ఓట్స్, బెర్రీలు వంటివి వేసుకొని తినడం ఉత్తమం.

Advertisement

టమోటో
ఎంతోమంది చెర్రీ, టమోటోలు, కీరా దోసకాయను సలాడ్లో వేసుకొని కలిపి తింటూ ఉంటారు. దోసకాయలు నీటిని విడుదల చేస్తాయి. టమోటోలా రుచిని ఇది మార్చేస్తుంది. దోసకాయలో స్వల్పంగా చేదు ఉంటుంది. ఇది టమాటోలోని రుచితో కలిసి విచిత్రమైన రుచిని అందిస్తుంది. ఇది మంచి ఆహార కాంబినేషన్ కూడా కాదు. టమోటోలను దోసకాయతో కాకుండా బెల్ పెప్పర్స్, ఉల్లిపాయలు వంటి వాటితో కలిపి తింటే ఆరోగ్యకరం.

మాంసాహారాలు
కీరా దోసకాయను మాంసాహారాల్లో కలిపి తినకూడదు. కీరా దోసకాయ తేలికగా ఉంటుంది. కీరా దోసకాయ రుచి, ఆకృతి మాంసంతో విభేదిస్తాయి. దోసకాయలలో నీటి శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి కాల్చిన లేదా వండిన మాంసాలతో చేసినప్పుడు అది తడి తడిగా అయిపోతుంది, తినాలనిపించదు కూడా. మీకు మాంసంతో తినాలనిపిస్తే కాల్చిన బంగాళదుంపలను లేదా వేయించిన ఆకుకూరలను కలుపుకొని తినండి.

Advertisement

వెల్లుల్లి
వెల్లుల్లిలో బలమైన ఘాటైన రుచి ఉంటుంది. చాలామంది దోసకాయలు, వెల్లుల్లి తరుగు కలిపి తింటూ ఉంటారు. అలాగే వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదే. అయినా దోసకాయతో కలిస్తే అది అంత ఆరోగ్య ప్రయోజనాలను అందించకపోవచ్చు. కాబట్టి వెల్లుల్లి దోసకాయను విడివిడిగా తింటేనే ఆరోగ్యానికి మంచిది. వీటిని కలిపి తినే ప్రయత్నం చేయవద్దు.

పుల్లని పండ్లు
పుల్లని పండ్లను సిట్రస్ పండ్లు అంటారు. నారింజ, నిమ్మకాయ వంటి సిట్రస్ పండ్లు వేసవిలో అధికంగానే దొరుకుతాయి. వీటిని దోసకాయలతో తినడానికి ప్రయత్నించవద్దు. సిట్రస్ పండ్లలో ఆమ్లత్వం ఉంటుంది. ఇది దోసకాయ రుచిని అధిగమిస్తుంది. దీనివల్ల అదొక రకమైన పుల్లని వాసన రుచి వస్తుంది. అధిక ఆమ్లత్వం దోసకాయల ఆకృతిని, రుచిని చెడగొడుతుంది. కాబట్టి ఈ రెండింటిని విడివిడిగా తినడమే అన్ని విధాలా మంచిది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×