E-Paper
Advertisement

Saggubiyyam Benefits: సీజన్ మారినా బెనిఫిట్స్ మారదు.. సగ్గుబియ్యం తింటే ఆరోగ్య ప్రయోజనాలు గ్యారెంటీ!

Saggubiyyam Benefits: సీజన్ మారినా బెనిఫిట్స్ మారదు.. సగ్గుబియ్యం తింటే ఆరోగ్య ప్రయోజనాలు గ్యారెంటీ!
Advertisement

Saggubiyyam Benefits: సగ్గుబియ్యం పేరు వినగానే చాలామందికి పాయసం, పరమాన్నం వంటి తీయని వంటల్లో ఉపయోగిస్తారనే తెలుసు. కానీ ఇది కేవలం తీపి వంటకాలకు మాత్రమే పరిమితం కాదు. సగ్గుబియ్యం అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది కర్రపెండలం చెట్టు నుండి వచ్చే దుంపలతో తయారు అవుతుంది. దీనివల్ల ఇది సహజంగా ప్రాసెస్ అయినా ఆరోగ్యకరమైన ఆహారం అని చెబుతున్నారు నిపుణులు. అలాగే ఆయుర్వేదంలోనూ సగ్గుబియ్యానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ క్రమంలో సగ్గుబియ్యం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఓసారి చూసేద్దాం.

శరీరానికి చలువ అందిస్తుంది:

సగ్గుబియ్యం లేదా సాబుదానాగా పిలిచే ఈ పదార్థం శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. దీనిలో పిండిపదార్థాలు అధికంగా ఉండటంతో జావలా వండుకుంటే.. పొట్టలో అసౌకర్యం తగ్గి శరీరం ఉత్సాహంగా ఉంటుంది. ఉదయం పూట సగ్గుబియ్యాన్ని తీసుకుంటే ఆ రోజంతా శరీరానికి శక్తి స్థాయిలు పెరుగుతాయి. అలాగే ఈ సగ్గుబియ్యాన్ని వేసవిలో వేడి తగ్గించుకోవడాని ఎక్కువగా తీసుకుంటారు. అంతేకాదు.. ఎక్కువ వేడి శరీరం ఉన్నవారికి, కారం, మసాలా ఉన్న ఆహారం తింటే ఇబ్బంది పడేవాళ్లకి సగ్గుబియ్యం ఉపశమనాన్ని కలిగిస్తుంది. పాలు లేదా నీటిలో ఉడికించి.. కొద్దిగా చక్కెర కలిపి తింటే పొట్టలో అసౌకర్యం, శరీరంలో వేడి తగ్గి ఇట్టే తగ్గిపోతుంది.

Advertisement

Also Read: ‘58 నిమిషాల పని-2 నిమిషాల వ్యాయామం’.. ఈ సింపుల్ ఫార్ములాను ఫాలో అవుతున్నారా?

పోషకాలు మెండు:

సగ్గుబియ్యం జీర్ణవ్యవస్థకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని తరచూ తీసుకుంటే.. ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. అలాగే అజీర్తి తగ్గి గ్యాస్, అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. మలబద్ధకం లేదా విరేచన సమస్యలను కూడా సగ్గుబియ్యం ద్వారా నియంత్రించవచ్చు. దీనిలోని పిండి పదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్ సి, క్యాల్షియం శరీరానికి అవసరమైన పోషకాలు అందించడంతో వృద్ధులు, పిల్లలందరికీ సులభంగా జీర్ణమవుతుంది. రోజూ ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుంటే జీర్ణాశయంలోని అల్సర్లు తగ్గి పేగుల సమస్యలు పరిష్కారమవుతాయి.

లాభాలు అనేకం:

Advertisement

ఎముకల ఆరోగ్యానికి సగ్గుబియ్యం ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉన్న క్యాల్షియం ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచి, విరిగిన ఎముకల చికిత్సలో కూడా ఉపకరిస్తుంది. నీరసం, అలసట, బద్దకంలా అనిపించే వారికి సగ్గుబియ్యం శక్తి, ఉత్సాహం కలిగిస్తుంది. జ్వరం వచ్చినప్పుడు సగ్గుబియ్యాన్ని జావగా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే, రక్త సరఫరా మెరుగుపటడం, బీపీ నియంత్రణ, హైబీపీ ఉన్నవారికి ఉపశమనం లభించడం వంటి అనేక లాభాలను అందిస్తుంది. అయితే గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ 80 వరకు ఉండటంతో, మధుమేహులు సగ్గుబియ్యం ఎక్కువగా తినకూడదు. తగిన జాగ్రత్తలు పాటిస్తూ తీసుకుంటే సగ్గుబియ్యం మంచి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

Also Read: టూత్‌బ్రష్ విషయంలో చాలామంది చేసే తప్పులు ఇవే.. మీరు కూడా చేస్తున్నారా?

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×