E-Paper
Advertisement

India Defeated Nepal by 82 Runs: నేపాల్‌పై భారత్ ఘన విజయం

India Defeated Nepal by 82 Runs: నేపాల్‌పై భారత్ ఘన విజయం
Advertisement

India defeated Nepal by 82 Runs: మహిళల టీ20 ఆసియాకప్ మెగా టోర్నీలో భారత్ దూసుకెళ్తోంది. టోర్నీలో భాగంగా నేపాల్ తో మంగళవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ లో భారత్ అద్భుత విజయం సాధించింది. 82 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో సెమీస్ కు రీచ్ అయ్యింది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ లలోనూ విజయం సాధించిన విషయం తెలిసిందే. 179 పరుగుల లక్ష్య ఛేదనకు ప్రయత్నించిన నేపాల్ 20 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 96 పరుగులు తీసింది. ఓపెనర్ గా గ్రౌండ్ లోకి దిగిన సీతా రానా మాగర్ 18 పరుగులు తీశారు. ఇటు భారత బౌలర్లు నేపాల్ ప్లేయర్లు పరుగులు తీసేందుకు అవకాశం ఇవ్వలేదు. దీప్తి శర్మ 3 వికెట్లు తీయగా, రధా యాదవ్, అరుంధతి రెడ్డి చెరో 2 వికెట్లు తీశారు. రేణుక సింగ్ ఒక వికెట్ పడగొట్టారు.

Also Read: కేంద్ర బడ్జెట్.. క్రీడలకు ఎప్పటిలా అవే నిధులు

Advertisement

అయితే, అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ను ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 178 పరుగులు తీసింది. ఓపెనర్లలో షెఫాలీ వర్మ (81 – 48 బంతుల్లో ఒక సిక్స్, 12 ఫోర్లు), హేమలత (47- 42 బంతుల్లో ఒక సిక్స్, 5 ఫోర్లు) పరుగులు తీశారు. నేపాల్ బౌలర్లు.. సీతారాన మగర్ 2 వికెట్లు తీయగా, కబితా జోషి ఒక వికెట్ పడగొట్టింది.

ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి టీమిండియా దూకుడుగా ఆడుతూ వచ్చింది. తొలి ఓవర్ లోనే రెండు ఫోర్ల సాయంతో 10 పరుగులు తీశారు. ఓ వైపు నేపాల్ బౌలర్లు విరుచుకుపడుతున్నా.. బౌండరీల మోత మోగించారు. దీంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది.

Advertisement

తాజా విజయంతో గ్రూప్ ఏ నుంచి భారత్, పాకిస్థాన్ జట్లు సెమీస్ కు చేరుకున్నాయి. నేపాల్, యూఏఈ జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×