E-Paper
Advertisement

Sensex : వరుసగా రెండోరోజూ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Sensex : వరుసగా రెండోరోజూ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
Advertisement

Sensex : భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 203 పాయింట్లు పెరిగి 59,960 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 17,787 పాయింట్ల దగ్గర ముగిసింది. అమెరికా సహా అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఉన్నా… భారత సూచీలు ఈ వారాన్ని లాభాల్లో ముగించడం విశేషం.

ఉదయం 59,746 పాయింట్ల దగ్గర లాభాల్లో మొదలైన సెన్సెక్స్‌… ఇంట్రాడేలో 60,133-59,739 పాయింట్ల మధ్య ఊగిసలాడి… చివరికి 203 పాయింట్ల లాభంతో ముగిసింది. నిఫ్టీ కూడా 50 పాయింట్లు పెరిగింది. సెన్సెక్స్‌30 సూచీలో 21 షేర్లు లాభపడ్డాయి. మారుతీ, రిలయన్స్‌, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టైటన్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభపడగా… టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు నష్టపోయాయి.

Advertisement

మరోవైపు… అమెరికా ట్రెజరీ రాబడులు మందగించడం, డాలర్ విలువ తగ్గడంతో… రూపాయి మారకం విలువ స్వల్పంగా బలపడింది. 7 పైసలు బలపడ్డ రూపాయి… డాలర్ మారకం విలువతో పోలిస్తే 82 రూపాయలా 34 పైసల దగ్గర ముగిసింది. గత మూడు సెషన్లలో రూపాయి విలువ 50 పైసల మేర లాభపడటం విశేషం.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×