E-Paper
Advertisement

Artificial Intelligence: కృత్రిమ మేధస్సు పరిశోధనలపై ప్రత్యేక దృష్టి..

Artificial Intelligence: కృత్రిమ మేధస్సు పరిశోధనలపై ప్రత్యేక దృష్టి..
Advertisement
Artificial Intelligence

Research on Artificial Intelligence

కృతిమ మేధస్సు (ఏఐ)పై ఇప్పటికీ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. ఒకవైపు ఈ పరిశోధనలు జరుగుతుండగానే మరోవైపు ఈ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ గురించి పరీక్షలు చేస్తున్నారు మరికొందరు. అందులో భాగంగానే 2021 జూన్‌లో నేషనల్ ఆర్టిఫిషియల్ రీసెర్చ రిసౌర్స్ (నైర్ర్) టాస్క్ ఫోర్స్ ఏర్పాటయ్యింది. తాజాగా కృత్రిమ మేధస్సుపై ఈ టాస్క్ ఫోర్స్ ఓ ఫైనల్ రిపోర్ట్‌ను విడుదల చేసింది.

నైర్ర్ టాస్క్ ఫోర్స్ అనేది ఒక అడ్వైజరీ కమిటీ. 2020లో నేషనల్ ఏఐ ఇనిషియేటివ్ యాక్ట్ అనేది ప్రారంభమైన తర్వాత దీని ఏర్పాటు జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్ కనుగొన్న విషయాలపై ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ సంస్థలకు కూడా యాక్సెస్ ఉంటుంది. ఇటీవల ఈ టాస్క్ ఫోర్స్ విడుదల చేసిన ఫైనల్ రిపోర్ట్‌లో ప్రజల దగ్గర నుండి కూడా కొంత సమాచారాన్ని పొందుపరిచింది. ఫైనల్ రిపోర్ట్ తయారైన తర్వాత 11 పబ్లిక్ మీటింగ్‌లు జరిగాయి. ఆ తర్వాతే ఈ రిపోర్ట్ బయటికొచ్చింది.

Advertisement

కృత్రిమ మేధస్సుపై సమాచారాన్ని బయటికి రానివ్వాలా వద్దా అనే అనుమానం శాస్త్రవేత్తల మధ్యే కాదు.. ప్రభుత్వాలలో కూడా ఉంది. అయితే దీనికి సమాధానాన్ని టాస్క్ ఫోర్స్ ఈ ఫైనల్ రిపోర్ట్‌లో పొందుపరిచారు. ఏఐ రిసెర్చ్ డెవలెప్‌మెంట్ గురించి అందరికీ తెలియడం వల్ల దానిపై పనిచేసే పరిశోధకులకు కూడా కొత్త ఐడియాలు వచ్చే అవకాశం ఉంటుందని, అది మంచిదే అని వారు తెలిపారు. దీని వల్ల టెక్నాలజీ రంగంలో కూడా హెల్తీ పోటీ మొదలవుతుందని వారు అన్నారు.

ప్రస్తుతం అమెరికాలో ఏఐపై పరిశోధనలు ఊపందుకున్నాయి. కానీ ఏఐపై ఏర్పాటు చేస్తున్న కొత్త అప్లికేషన్స్‌పై పరిశోధకులకు, సైన్స్ స్టూడెంట్స్‌కు ఎవరికీ యాక్సెస్ లేదు. నైర్ర్ టాస్క్ ఫోర్స్ ఈ పద్ధతిని మార్చనుంది. అందరికీ ఏఐ పరిశోధనల గురించి సమాచారం అందించనుంది. అంతే కాకుండా వారు వ్యక్తిగతంగా పరిశోధనలు నిర్వహించడానికి సహాయం చేయనుంది. అయితే ఈ రిపోర్ట్‌ను అమెరికా ప్రభుత్వం ఎలా స్వీకరించనుందో చూడాలి.

Advertisement

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×