E-Paper
Advertisement

Skin Problems : చర్మ సమస్యలకు చెక్‌పెట్టే బంగాళాదుంప

Skin Problems : చర్మ సమస్యలకు చెక్‌పెట్టే బంగాళాదుంప
Advertisement

Skin Problems : ఆలుగడ్డలు.. వీటిని బంగాళాదుంపలు అని కూడా అంటారు. ఈ బంగాళాదుంపలతో కూరలు, ఫ్రైలే కాకుండా చర్మ సమస్యలను కూడా నయం చేసుకోవచ్చు. ఈ ఆలుగడ్డలో పొటాషియం, బి విటమిన్లు, మాంగనీస్, విటమిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. అంతేకాకుండా చర్మంపై మచ్చలను కూడా తొలగిస్తాయి. ఆలుగడ్డలను పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిక్సీలో వేసి జ్యూస్ చేసుకోవాలి. తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి దాన్ని ముఖానికి రాసుకొని 20 నిమిషాలు ఉంచాలి. ఆరిన తర్వాత కడుక్కోవాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది. అంతేకాకుండా కాంతివంతంగా మారుతుంది. బంగాళాదుంపల గుజ్జును కొద్దిగా తీసుకొని అందులో నిమ్మరసం వేసి ఆ మిశ్రమాన్ని ముఖంపై ఉన్న డార్క్ బ్యాచులపై రాసుకోవాలి. ఇలా తరచూ రాస్తే పోతాయి. ముఖానికి సాహసిద్ధమైన కాంతి లభిస్తుంది. ఆలుగడ్డల జ్యూస్, బియ్యం పిండి, నిమ్మరసం, తేనే, రోజ్‌ వాటర్ కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. తరచూ ఇలా చేయడం వల్ల చర్మం ఆరోగ్యంగా మారుతుంది. డ్రై స్కిన్ ఉన్నవారు తేనెను ఉపయోగిస్తే చాలా మంచిది. ఐదు చెంచాల ఆలుగడ్డ జ్యూస్, ఒక చెంచా బేకింగ్ సోడాను కలిపి సరిపడా నీరు పోసి కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి కాసేపు తర్వాత కడిగేయాలి. దీంతో ముఖంపై ఉండే ఫోర్స్ శుభ్రం అవుతాయి. బంగాళాదుంపల జ్యూస్, కీరాజ్యూస్‌లను సమభాగంలో కలిపి ఆ మిశ్రమాన్ని కళ్ల కింద వలయాకారంలో రాసుకోవాలి .ఒక పావుగంట తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల డార్క్‌ సర్కిల్స్‌తగ్గుతాయి. కళ్ల వాపులు కూడా పోతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆలుగడ్డ జ్యూస్, ముల్తాని మట్టి, లెమన్ జ్యూస్ కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని చర్మంపై రాసుకోవాలి, ఆ తర్వాత కడిగివేయాలి, తరచూ ఇలా చేయడం వల్ల మచ్చలు పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×