E-Paper
Advertisement

Markets gained in weekend : వీకెండ్ లో లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Markets gained in weekend : వీకెండ్ లో లాభాల్లో ముగిసిన మార్కెట్లు
Advertisement

Markets gained in weekend : భారత స్టాక్ మార్కెట్లలో రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలున్నా… చివరి అరగంటలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 114 పాయింట్ల లాభంతో 60,950 పాయింట్ల దగ్గర ముగియగా… నిప్టీ 64 పాయింట్ల లాభంతో 18,117 పాయింట్ల దగ్గర ముగిసింది.

అమెరికా ఫెడ్‌ వడ్డీరేట్లను పెంచడం, మరిన్ని పెంపులు తప్పవన్న సంకేతాలివ్వడం… అంతర్జాతీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. ఆ ఎఫెక్ట్ మన సూచీలపైనా పడింది. ఉదయం సెన్సెక్స్ 60,698 పాయింట్ల దగ్గర లాభాల్లో మొదలైనా… ఆ తర్వాత నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 61,004-60,666 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. చివరి అరగంట ముందు వరకు నష్టాల్లోనే ఉన్న సూచీలు… కనిష్టస్థాయిల దగ్గర కొనుగోళ్లు మొదలవడంతో లాభాలబాట పట్టాయి. విదేశీ ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లు జరపడంతో… చివరికి సెన్సెక్స్ 114 పాయింట్ల లాభంతో ముగిసింది. సెన్సెక్స్‌-30 సూచీలో 18 షేర్లు లాభపడ్డాయి. లోహ రంగ షేర్లు 4 శాతం దాకా పెరగ్గా… ప్రభుత్వ బ్యాంకుల షేర్లు ఒక శాతం మేర లాభపడ్డాయి. ఫార్మా రంగ షేర్లు ఒక శాతం మేర నష్టపోయాయి.

Advertisement

ఇక… డాలరుతో రూపాయి మారకం విలువ 47 పైసలు బలపడి… 82 రూపాయల 41 పైసల వద్ద ముగిసింది. గురువారం సెషన్ లో 8 పైసల మేర నష్టపోయిన రూపాయి… శుక్రవారం ఏకంగా 47 పైసలు లాభపడింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×