E-Paper
Advertisement

Mobile Charging : చేతితో పట్టుకుంటే చాలు..! ఫోన్‌కు ఛార్జింగ్ అందినట్టే..!

Mobile Charging :  చేతితో పట్టుకుంటే చాలు..! ఫోన్‌కు ఛార్జింగ్ అందినట్టే..!
Advertisement

Mobile Charging : శరీరంలో ఇంటర్నల్ ఎనర్జీతో పాటు బయటవాటిని ఆకర్షించే ఎనర్జీ కూడా ఉంటుందని శాస్త్రవేత్తలు పలుమార్లు చెప్తున్నారు. ఆ ఎనర్జీ గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు వారు బయటపెట్టారు. ప్రస్తుతం మనుషుల అవసరాలకు తగినట్టుగా కరెంటు సరిపోవడం లేదు. అందుకే శాస్త్రవేత్తలు వేర్వేరు ప్రత్యామ్నాయాలను సిద్ధం చేస్తున్నారు. అందులో మనిషి శరీరం కూడా ఒకటని వారు అంటున్నారు.. ఇదెలా సాధ్యమని చాలామంది అనుమానిస్తున్నా.. శాస్త్రవేత్తలు మాత్రం దీనిని నిజం చేసి చూపిస్తామంటున్నారు.

Advertisement

థెర్మో ఎలక్ట్రిక్ మెటీరియల్స్‌ ద్వారా వేడిని కరెంటుగా మార్చడానికి శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. కరెంటు అవసరాలను తీర్చడం కోసం తాజాగా సోలార్ పవర్ అనే ఐడియా ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అయ్యింది. చాలావరకు ఇతర దేశాల్లోనే కాకుండా ఇండియాలో కూడా సోలార్ పవర్‌పై ఆధారపడుతున్న మనుషుల సంఖ్య పెరిగిపోతోంది. అయితే కేవలం సోలార్ పవర్ మాత్రమే కాకుండా మరెన్నో ఇతర ప్రత్యామ్నాయాలు కూడా మనుషుల కరెంటు అవసరాలను తీరుస్తుందని తెలిపారు.

శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఈ కొత్త ప్రక్రియతో కరెంటును తయారు చేయడం కోసం పెద్ద పెద్ద పరికరాలు, సూర్యుడి లాంటి వేడి ఆబ్జెక్ట్స్ ఏమీ అవసరం లేదని వారు చెప్తున్నారు. కేవలం మనిషి శరీరంలోని హీట్‌తోనే చాలావరకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌కు ఛార్జింగ్ పెట్టవచ్చని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. మామూలుగా మనిషి పనిచేస్తున్నప్పుడు చాలా హీట్ అనేది ఉత్పత్తి అవుతుందని, కాకపోతే అదంతా వాతావరణంలోకి వెళ్లిపోయి వృథా అవుతుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అందుకే దీనిని థెర్మల్ పవర్‌తో కరెంటుగా మార్చాలనే ఆలోచనతో ముందుకొచ్చారు.

Advertisement

కేవలం గ్యాడ్జెట్స్ మాత్రమే కాకుండా ఆటోమొబైల్స్ ఛార్జ్ చేయడానికి కూడా బాడీలోని హీట్ అవసరం అవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. హీట్‌ను కరెంటుగా మార్చడం కోసం వారి తగ్గర చాలా పద్ధతులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. అందులో ఒకటి థెర్మో ఎలక్ట్రిక్ మెటీరియల్స్ పద్ధతి అని చెప్పారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఒక ప్రోటోటైప్ మోడల్‌ను వారు సిద్ధం చేసి పెట్టారు. ఈ టెక్నాలజీ సక్సెస్ అయితే ఫోన్స్‌ను చేతితో పట్టుకోవడంతో, ల్యాప్‌టాప్స్‌ను ఒడిలో పెట్టుకోవడంతోనే ఛార్జ్ అయిపోతాయని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. కానీ ప్రస్తుతానికి ఈ ప్రయోగాలు ప్రారంభం దశలోనే ఉన్నాయన్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×