E-Paper
Advertisement

Twitter Employees : తీసేసినా.. వందల కోట్లు ఇవ్వాల్సిందే!

Twitter Employees : తీసేసినా.. వందల కోట్లు ఇవ్వాల్సిందే!
Advertisement

Twitter Employees : ట్విట్టర్ ను కొన్న వెంటనే సీఈఓ పరాగ్ అగర్వాల్ సహా కీలక ఉద్యోగులను సంస్థ నుంచి తీసేశాడు… కొత్త యజమాని మస్క్. అయితే… వాళ్లను ఊరికే సాగనంపడానికి వీల్లేదు. ఉన్నఫళంగా సాగనంపాలంటే కచ్చితంగా పరిహారం చెల్లించాల్సిందే. మస్క్ తీసేసిన టాప్ ఎంప్లాయిస్ అందరికీ కలిపి… మొత్తం 88 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది… మస్క్. ఇందులో ఎవరికి ఎంత వస్తుందో చూద్దాం…

2021 నవంబర్ లో ట్విట్టర్ సీఈఓగా బాధ్యతలు చేపట్టాడు… పరాగ్ అగర్వాల్. ఏడాది లోపు ఆ పోస్ట్ నుంచి తీసేయాల్సి వస్తే… ఏకంగా 42 మిలియన్ డాలర్ల పరిహారం అతనికి చెల్లించాల్సి ఉంటుంది. మస్క్ తీసేసిన ఉద్యోగుల్లో అత్యధిక పరిహారం అందుకోబోతున్నది పరాగ్ అగర్వాలే. భారత కరెన్సీ ప్రకారం పరాగ్ 345 కోట్ల రూపాయలకు పైగా అందుకోబోతున్నాడు. మాజీ సీఎఫ్‌వో నెడ్ సెగల్ 25.4 మిలియన్‌ డాలర్లు, చీఫ్ లీగల్ ఆఫీసర్ విజయ గద్దె 12.5 మిలియన్‌ డాలర్లు అందుకోనున్నారు. అలాగే చీఫ్ కస్టమర్ ఆఫీసర్ సారా పెర్సోనెట్ కు 11.2 మిలియన్ల డాలర్లు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

ట్విట్టర్ ను చేజిక్కించుకున్న తర్వాత మొత్తం సిబ్బందిలో 75 శాతం మంది ఉద్యోగులను మస్క్ తొలగించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అందులో భాగంగానే టాప్ ఎంప్లాయిస్ పై వేటు పడటంతో… కింది స్థాయి ఉద్యోగుల్లోనూ ఆందోళన మొదలైంది. దాంతో… చాలా మంది ప్రత్యామ్నాయ ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. కొందరు గుగూల్, ఫేస్ బుక్ సహా మరికొన్ని సంస్థల్లో ఇప్పటికే చేరిపోయారు. ఉన్న వాళ్లు మాత్రం… తమ ఉద్యోగాలకు ఎప్పుడు ఎర్త్ పెడతారోనని బిక్కుబిక్కుమంటూ విధులకు హాజరవుతున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×