E-Paper
Advertisement

Diamonds Research:వజ్రాలపై పరిశోధనలకు రూ.242 కోట్ల బడ్జెట్..

Diamonds Research:వజ్రాలపై పరిశోధనలకు రూ.242 కోట్ల బడ్జెట్..
Advertisement

Diamonds Research:భూమిలో పెరుగుతున్నదాని దగ్గర నుండి ఆకాశంలో ఎగురుతున్నదాని వరకు శాస్త్రవేత్తలు అన్నింటిపై పరిశోధనలు మొదలుపెట్టారు. అంతే కాకుండా నేచురల్‌గా పుట్టుకొస్తున్న ప్రతీదానికి ఆర్టిఫిషియల్‌ ప్రింట్‌ను తయారు చేసే ప్రయత్నంలో ఉన్నారు. తాజాగా వజ్రాలపై కూడా కొత్త పరిశోధనలు మొదలుపెట్టారు పరిశోధకులు.

తాజాగా కేంద్రం బడ్జెట్‌ను ప్రకటించింది. దీనిపై ఇప్పటికీ పలు సైన్స్ అండ్ టెక్నాలజీ నిపుణులు అసంతృప్తిగానే ఉన్నారు. కానీ మరికొందరు మాత్రం పరిశోధన విషయంలో అభివృద్ధి చెందాలనుకుంటున్న రంగాలకు కూడా ఇది కొత్త ఊపునిస్తుందని అభిప్రాయపడుతున్నారు. అలాగే ల్యాబరెటరీలో పెరిగిన వజ్రాలపై పరిశోధనలు చేయడానికి కూడా మద్రాస్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి రూ.242 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. అయిదేళ్ల పాటు వజ్రాలపై పరిశోధనలు చేయడానికి ఈ బడ్జెట్ ఉపయోగపడనుంది.

Advertisement

ఈ బడ్జెట్ కేవలం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి మాత్రమే కాకుండా ఈ పరిశోధనల్లో భాగమయ్యే ప్రతీ ఒక్కరికి అందాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇండియన్ సెంటర్ ఫర్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ (ఇన్సెంట్ ఎల్జీడీ) గత రెండు దశాబ్దాలుగా ఈ రంగంలో పరిశోధనలు చేస్తూనే ఉంది. అంతే కాకుండా డైమండ్ రీసెర్చ్‌లో టెక్నాలజీ పరంగా ఎంతో సాయం చేసింది. అంతే కాకుండా స్పేస్, డిఫెన్స్ విభాగాలకు కూడా తన సాయాన్ని అందించింది.

మామూలుగా తయారు చేసిన డైమండ్స్ కంటే ల్యాబరటరీ గ్రోన్ డైమండ్స్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. వాటిని క్వాలిటీని కనుక్కోవడానికి ప్రత్యేక పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంటుందని వారు తెలిపారు. ఈ రంగంలో చేసే పరిశోధనలు అర్థం చేసుకోవడానికి చాలా కష్టమని, అంతే కాకుండా చాలా ఖర్చుతో కూడుకున్న పని అని వారు బయటపెట్టారు. దీనికోసం ఇతర దేశాల నుండి ధర ఎక్కువైన పరికరాలను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందన్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×