E-Paper
Advertisement

E-Bike : ఒక్కసారి ఛార్జింగ్‌తో 150 కి. మీ. జర్నీ.. ఈ-బైక్ ప్రత్యేకతలివే..?

E-Bike : ఒక్కసారి ఛార్జింగ్‌తో 150 కి. మీ. జర్నీ.. ఈ-బైక్ ప్రత్యేకతలివే..?
Advertisement

E-Bike : సాధారణంగా బైక్ పై ఇద్దరు మించి ప్రయాణించలేం. కానీ ఆ యువకుడు తయారు చేసిన ఎలక్ట్రిక్ బైక్ పై ఆరుగురు ప్రయాణించే వీలుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే చాలు 150 కిలోమీటర్లు మైలేజ్ వస్తుంది. ఈ సూపర్ ఈ-బైక్ ను ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆజంగఢ్‌ జిల్లా లోహ్రా గ్రామానికి చెందిన అష్షద్‌ అబ్దుల్లా అనే యువకుడు రూపొందించాడు. ఆరుగురు ప్రయాణించేలా ఎలక్ట్రిక్‌ బైక్‌ తయారుచేసి హౌరౌ అనిపించాడు.

అష్షద్ అబ్దుల్లా ఐటీఐ పూర్తి చేశాడు. ప్రస్తుతం బీసీఏ చదువుతున్నాడు. తనకు వచ్చిన చిన్న ఆలోచనతో ఎలక్ట్రిక్‌ బైక్‌ తయారీకి సంకల్పించాడు. ఎంతో శ్రమించి తక్కువ ఖర్చుతోనే కొత్త ఈ- బైక్ ను ఆవిష్కరించాడు.

Advertisement

అష్షద్ బైక్ తయారీ కోసం ఎంతో శ్రమించాడు. గూగుల్‌, యూట్యూబ్‌ల ద్వారా విద్యుత్తు వాహనాల గురించి సమాచారం తెలుసుకున్నాడు. ఆ తర్వాత నెల రోజులు కష్టపడి తన లక్ష్యాన్ని సాధించాడు. ఈ- బైక్‌తో పర్యావరణానికి హాని ఉండదు. అతితక్కువ ఖర్చుతో బైక్ నడుపుకోవచ్చు. ఈ- బైక్ పై ఎక్కువ మంది ప్రయాణించడానికి వీలుంది. ఒక్కసారి బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్‌ చేస్తే 150 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు.

ఈ- బైక్‌ గురించి తెలుసుకున్న వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్ర .. అబ్దుల్లా ప్రతిభను ప్రశంసిస్తూ ట్వీట్‌ కూడా చేశారు. పెట్రోల్‌ ధర రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ- బైక్ ను రూపొందించానని అబ్దుల్లా తెలిపాడు. పాత సామానును ఉపయోగించుకొని కేవలం రూ.10-12 వేల ఖర్చుతో ఎలక్ట్రిక్‌ బైక్‌ను తయారు చేశానని వివరించాడు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×