E-Paper
Advertisement

Kidney Problems : మూత్రం ఈ రంగులో ఉందా.. అయితే మీ కిడ్నీలు..?

Kidney Problems: భారత దేశంలో కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ ప్రకారం మన దేశంలో 10 శాతం మంది దీర్ఘకాలిక కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని ఈ నివేదిక చెబుతుంది.

Kidney Problems : మూత్రం ఈ రంగులో ఉందా.. అయితే మీ కిడ్నీలు..?
Advertisement

Kidney Problems : భారత దేశంలో కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ ప్రకారం మన దేశంలో 10 శాతం మంది దీర్ఘకాలిక కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని ఈ నివేదిక చెబుతుంది. 2010 నుంచి 2013 మధ్యలో సంభవించిన మరణాల్లో 15 నుంచి 69 ఏళ్లలోపు వారు కిడ్నీ ఫెయిల్యూర్ వల్లే చనిపోయారు.

  • కిడ్నీలు శరీరంలోని ఫ్లూయిడ్స్‌‌లో ఉన్న వ్యర్థాలను వేరుచేసి మూత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది. శరీరానికి హాని కలిగించే జీవ పదార్థాలు మూత్రం ద్వారా బయటకు వెళ్తాయి.
  • శరీరంలోని ప్రధాన అవయవాల్లో కిడ్నీలు చాలా ముఖ్యమైనవి. అవి శరీరంలో కాల్షియం, సోడియం, పొటాషియం, వంటి మినరల్స్ సమతులు స్థాయిలో ఉండేలా చూస్తాయి. ఎర్రరక్త కణాల నిర్మాణంలో కిడ్నీలు కీలకపాత్ర పోషిస్తాయి. రక్తంలోని పీహెచ్ లెవల్స్ సమతుల్యాన్ని కాపాడతాయి. అలానే శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపుతాయి.
  • శరీరంలో రక్తం శుద్ధి జరిగే క్రమంలో లవణాలు, గ్లూకోజ్ నీటిని కిడ్నీల ద్వారా రక్తకణాలు సేకరిస్తాయి. శుద్ధి ప్రక్రియ అనంతరం నరాల ద్వారా రక్తం శరీరం మొత్తం సరఫరా అవుతుంది.
  • శరీరంలోని నీటి నిల్వలను కిడ్నీలు సమతుల్యం చేస్తాయి. డయాబెటిస్, రక్తంలో షుగర్ లెవల్స్‌ను పెంచుతుంది. అది కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారి తీయొచ్చు. డయాబెటిస్ రోగులు కిడ్నీ వ్యాధుల బారినపడుతున్నారు.
  • ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరి శరీరం నుంచి మూత్రం రూపంలో కొద్దిమొత్తంలో ప్రొటీన్ బయటకు పోతుంది. ఈ ప్రొటీన్లు మూత్రం ద్వారా బయటకి వెళ్లిపోతే అది శరీరానికి చాలా ప్రమాదం. ఇలా జరగడానికి డయాబెటిస్ ప్రధాన కారణం. డయాబెటిస్ కంట్రోల్‌లో లేకపోతే ప్రోటీన్ మూత్రం రూపంలో బయటకి వెళ్లిపోతుంది.హైబీపీ, కిడ్నీ వ్యాధులు దీనికి ప్రధాన కారణం.
  • శరీరంలో ఇటువంటి ప్రక్రియ జరిగినప్పుడు “మూత్రం నురగతో వస్తుంది”. కొద్ది రోజుల తర్వాత చేతులు, కాళ్లలో వాపు కనిపిస్తుంది. వీటితో పాటు నీరసం, కడుపు నొప్పి, కడుపులో ఇన్ఫెక్షన్ కూడా రావొచ్చు.
  • మూత్రంలో నీరు, యూరియా, లవణాలు కలిసి ఉంటాయి. శరీరంలో ఎమినో యాసిడ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు లివర్ యూరియాను ఊత్పత్తి చేస్తుంది. శరీరంలోని ఫ్లూయిడ్స్ నుంచి వచ్చే ప్రధాన వ్యర్థ పదార్థం యూరియా. ఇది మూత్రం ద్వారా బయటకు వెళ్తుంది. శరీరంలోని ఫ్టూయిడ్స్‌ను కిడ్నీలు శుభ్రం చేస్తాయి. ఆ తర్వాత అవి రక్తంలో కలిసిపోతాయి.
  • సాధారణంగా మూత్రం ఎరుపు లేదా ముధురు గోధుమ రంగు, ఏదైనా ముదురు రంగులో వస్తే ఆ వ్యక్తి జాగ్రత్త పడాల్సి ఉంటుంది. చాలా విషయాలు ఈ రంగులపైనే ఆధారపడి ఉంటాయి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×