E-Paper
Advertisement

Antarctica:చైనా ప్లాన్ ఏంటి..? అయోమయంలో శాస్త్రవేత్తలు..

Antarctica:చైనా ప్లాన్ ఏంటి..? అయోమయంలో శాస్త్రవేత్తలు..
Advertisement

Antarctica:అంతరిక్షంపై తమ పరిశోధనలు బలపరచుకోవడానికి చైనా ఎంత దూరమయినా వెళ్లడానికి సిద్ధపడేలా అనిపిస్తోంది. ఇప్పటికే సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో అమెరికాకు సైతం గట్టి పోటీ ఇస్తున్న చైనా.. మిగత దేశాలు అందుకోనేంత స్పీడ్‌గా ముందుకు వెళ్లాలని చూస్తోంది. అందుకే ఓ కొత్త ప్రయత్నానికి చైనా సన్నాహాలు చేస్తోంది.

రష్యా, అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల తర్వాత తన మనిషిని పరిశోధనల కోసం అంతరిక్షం పంపించిన మూడో దేశంగా చైనా ఇప్పటికే పేరు తెచ్చుకుంది. అయితే మనుషులు జీవించని అంటార్టిక ఖండంలో ఓ గ్రౌండ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని చైనా సన్నాహాలు చేస్తున్నట్టుగా అక్కడి మీడియా ప్రచారం చేస్తోంది. ఆ స్టేషన్స్ ద్వారా సముద్రాలను స్టడీ చేసే శాటిలైట్స్‌కు సాయం అందించాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారని ఈ ప్రచురణలో తేలింది.

Advertisement

ఇతర దేశాలపై ఓ కన్ను వేసి ఉంచడానికి చైనా ఏర్పాటు చేస్తున్న ఈ గ్రౌండ్ స్టేషన్స్, మెరుగుపరుస్తున్న శాటిలైట్స్ పనిచేస్తాయేమోనని నిపుణులు అనుమానిస్తున్నారు. 2020 వరకు స్వీడెన్.. చైనాకు గ్రౌండ్ స్టేషన్స్ ఏర్పాటులో సాయంగా ఉండేది. కానీ చైనాలో జియోపాలిటిక్స్ ఎక్కువ అవ్వడంతో స్వీడెన్ ఆ పనికి నిరాకరించింది. దీంతో చైనానే సొంతంగా తమ గ్రౌండ్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన చేసినట్టుగా తెలుస్తోంది.

6.53 బిలియన్ డాలర్ల వేలంపాటలో చైనా గెలిచి అంటార్టికాలో గ్రౌండ్ స్టేషన్ ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని సాధించింది. ఈ నిర్మాణం చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ కో ఆధ్వర్యంలో జరగనుంది. ఇప్పటికీ ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టెక్నికల్ సమాచారం ఏదీ బయటికి రాకుండా శాస్త్రవేత్తలు జాగ్రత్తపడ్డారు. ముఖ్యంగా మరైన్ ఎకానమిలో పట్టు సాధించడానికే చైనా ఇదంతా చేస్తుందని చైనా మీడియా అంటోంది. చైనాను ఒక మరైన పవర్‌లాగా మార్చడానికి శాస్త్రవేత్తలు తమ ప్రయత్నం చేయాలని అనుకుంటున్నారట.

Advertisement

స్పేస్‌ను స్టడీ చేయడానికి, స్పేస్‌క్రాఫ్ట్ మెషిన్స్‌ను పరిశీలించడానికి చైనా.. అర్జెంటీనా పాటగానియాలో గ్రౌండ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. కానీ అప్పుడు కూడా చైనా మాటలను ఇతర దేశాలు నమ్మలేదు. ఇప్పుడు కూడా అంటార్టికాలో ఏర్పాటు చేస్తున్న గ్రౌండ్ స్టేషన్ వెనుక కూడా ఇంకా ఏదో ఆలోచన ఉంటుందేమో అని నిపుణులు ధృడంగా భావిస్తున్నారు. ఈ విషయంపై చైనా ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×