E-Paper
Advertisement

Automobile industry: ఆటోమొబైల్ రంగంలో భారీ లాభాలు.. రూ.8.7 లక్షల కోట్లు..

Automobile industry: ఆటోమొబైల్ రంగంలో భారీ లాభాలు.. రూ.8.7 లక్షల కోట్లు..
Advertisement
“Frankfurt, Hessen, Germany – April 04, 2012: Car drives up a ramp made from coins.”

Automobile industry: కోవిడ్ తర్వాత అన్ని రంగాలు భారీ నష్టాల్లోకి వెళ్లిపోయాయి. అవి కోలుకొని లాభాలు చవిచూడడానికి చాలా సమయం పడుతుంది. ప్రస్తుతం చూస్తున్న రిపోర్టుల ప్రకారం 2023 ఫైనాన్షియల్ ఇయర్‌లో ఆటోమొబైల్ రంగం లాభాల్లోకి వెళ్లిన్నట్టు తెలుస్తోంది. ఏకంగా రూ.8.7 లక్షల కోట్ల రెవెన్యూను ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ.. 2023 ఫైనాన్షియల్ ఇయర్‌లో సాధించిందని రిపోర్టులు చెప్తున్నాయి. 2024లో దీనికి మించిన లాభాలు రావాలని టార్గెట్‌గా పెట్టుకుంది.

ప్రస్తుతం ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో దాదాపు 1.9 కోట్ల మంది ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. 2.7 కోట్ల యూనిట్స్ ఆటోమొబైల్స్ తయారీలో నిమగ్నమయి ఉన్నాయి. ఇవన్నీ కలిసి రూ.8.7 లక్షల రెవెన్యూను సాధించడం మంచి విషయమని ఆటోమొబైల్ సంస్థలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. అన్నింటికంటే ఎక్కువగా ఈ రెవెన్యూ పెరగడంలో కీలక పాత్ర పోషించింది ప్యాసెంజర్ వెహికిల్స్ (పీవీ) అని తెలుస్తోంది. మొత్తం రెవెన్యూలో పీవీ 58 శాతాన్ని సాధించింది. అంటే దాదాపు రూ. 5 లక్షల కోట్లు.

Advertisement

ప్యాసెంజర్ వెహికిల్ తరువాతి స్థానంలో 2 వీలర్స్ ఉన్నాయి. రెవెన్యూలో ఇవి 21 శాతాన్ని దక్కించుకున్నాయి. అంటే దాదాపు రూ.1.8 లక్షల కోట్లు. ఆ తర్వాతి స్థానంలో కమర్షియల్ వెహికిల్స్ (సీవీ) 19 శాతంతో ఉంది. అంటే రూ. 1.7 లక్షల కోట్లు. చివరిగా 3 వీలర్‌కు 2 శాతం రెవెన్యూ దక్కింది. అంటూ రూ. 17 వేల కోట్లు. ఇక పీవీ విషయంలో ఎస్‌యూవీల హవా కొనసాగింది. ఈ రెవెన్యులో కూడా సగభాగం ఎస్‌యూవీ వల్లే సాధ్యమయ్యిందని రిపోర్ట్ చెప్తోంది. వీటితో పాటు లగ్జరీ వెహికిల్స్ కూడా 13 శాతం రెవెన్యూను అందించాయి.

గత కొన్నేళ్లలో కస్టమర్లు ఎక్కువగా మినీ కార్లను కొనడానికి ఆసక్తి చూపించడం లేదని రిపోర్టులో తేలింది. మినీ కార్ల విషయంలో మారుతి, హ్యుండాయ్, టాటా, మహీంద్ర, కియా, టయోటా, హోండా, వోల్క్స్‌వేగన్ లాంటి కంపెనీలు నష్టాలనే చవిచూసినట్టు తెలుస్తోంది. లాభాలను బట్టి కంపెనీలు తమ యూనిట్లను కూడా పెంచే సన్నాహాలు చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అంతే కాకుండా 2023 ఫైనాన్షియల్ ఇయర్ లాభాలను 2024 ఫైనాన్షియల్ ఇయర్‌లో బీట్ చేయాలని చాలావరకు సంస్థలు టార్గెట్‌గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×