E-Paper
Advertisement

Artificial Intelligence : మార్స్‌పై స్టడీకి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సిద్ధం..

Artificial Intelligence : మార్స్‌పై స్టడీకి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సిద్ధం..
Advertisement
Artificial Intelligence

Artificial Intelligence : కృత్రిమ మేధస్సు గురించి ప్రస్తుతం టెక్ ప్రియులు అందరికీ తెలుసు. ఈ కృత్రిమ మేధస్సుతోనే ఎన్నో అద్భుతాలు చేయాలని శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) అనేది కేవలం భూమిపైనే కాదు.. స్పేస్ ఇండస్ట్రీలో కూడా ఉపయోగపడుతుందని వారు నిరూపించాలని సన్నాహాలు చేస్తున్నారు. ఏఐతో స్పేస్ టెక్నాలజీలో అద్భుతాలు సృష్టించాలని శాస్త్రవేత్తలు ప్రయత్నాలు మొదలుపెట్టి తొలి అడుగు వేయనున్నారు.

ఇప్పటికే మార్స్‌పై ప్రయోగాలను వేగవంతం చేశారు శాస్త్రవేత్తలు. భూమిపై వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ లాంటి సమస్యలు ఏర్పడుతుండడంతో మార్స్‌పై జీవనాన్ని కొనసాగించవచ్చా లేదా త్వరలోనే తెలుసుకోవాలని వారు ప్రయత్నిస్తున్నారు. అంతే కాకుండా తాజాగా మార్స్‌పై నీటి ఆనవాళ్లు కూడా కనిపించడంతో వారికి మరింత ప్రోత్సాహం లభించింది. తాజాగా మార్స్‌పై జీవనం గురించి స్టడీ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ను ఉపయోగించాలని శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు.

Advertisement

కేవలం మార్స్‌లోనే కాదు.. చల్లటి ప్రాంతాల్లో కూడా మానవ జీవనం కొనసాగుతుందా లేదా అన్న విషయంపై ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పరిశోధనలు చేయనుంది. ఇప్పటికీ దీనికోసం ఉపయోగపడే ఒక ప్రత్యేకమైన ఏఐ మోడల్‌ను ఆస్ట్రోబయోలజిస్ట్‌లు సిద్ధం చేశారు. దాంతో చిలియన్ అటకామా ఎడారి ప్రాంతంలో ప్రయోగాలు కూడా చేపట్టారు. ఇది భూమిపైన ఎక్కువ ఎండిపోయిన ప్రాంతంగా చెప్పుకోబడుతుంది. దీనిపై జీవనం కొనసాగించవచ్చా లేదా అన్నదానిపై ఏఐ స్టడీ చేసింది.

ఏఐ చేసిన ఈ పరిశోధనలు 87.5 శాతం కరెక్ట్‌గా ఉన్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. దీన్ని బట్టి చూస్తే మార్స్‌పై కూడా మానవాలి జీవనం కొనసాగుతుందో లేదో తెలియడానికి ఏఐ ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయని వారు భావిస్తున్నారు. ప్రస్తుతం మార్స్ గురించి పూర్తిగా స్టడీ చేయడానికి పరిశోధకుల దగ్గర పూర్తిస్థాయి వనరులు లేవు. భూమిపై కాకుండా ఇంక ఎక్కడైన మానవ జీవనం సాధ్యమా అని తెలుసుకోవాలనుకున్న ప్రతీసారి వారికి ఇదే సమస్య ఎదురవుతోంది. ఈ విషయంలో ఏఐ వారికి సాయంగా నిలవనుంది.

Advertisement

కొత్త ఏఐ మోడల్ ఇతర గ్రహాలపై జీవనం కొనసాగించవచ్చా, ఒకవేళ ఆ అవకాశం ఉంటే ఏ ప్రాంతంలో జీవనం కొనసాగించడం సులువుగా ఉంటుంది అన్న విషయాలపై స్టడీ చేసి శాస్త్రవేత్తలకు తెలియజేయనుంది. దీంతో పాటు రోడ్‌మ్యాప్స్ లాంటివి తయారు చేయడానికి కూడా ఇది ఉపయోగపడనుందని తెలుస్తోంది. బయోసిగ్నేచర్స్‌ను కనుక్కునే విషయంలో ఏఐ సాయం కీలకంగా నిలవనుందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×