E-Paper
Advertisement

NOBEL PEACE PRIZE : మహిళల అణచివేతపై ఉక్కుపాదం మోపిన నర్గీస్ మొహమ్మదీకి నోబెల్ శాంతి పురస్కారం

NOBEL PEACE PRIZE : మహిళల అణచివేతపై ఉక్కుపాదం మోపిన నర్గీస్ మొహమ్మదీకి నోబెల్ శాంతి పురస్కారం
Advertisement

NOBEL PEACE PRIZE: ఇరాన్‌లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడినందుకు అందరికీ మానవ హక్కులు స్వేచ్ఛను పెంపొందించడానికి ఆమె చేసిన పోరాటానికి నర్గీస్ మొహమ్మదీకి 2023 నోబెల్ శాంతి బహుమతిని ఇవ్వాలని నార్వేజియన్ నోబెల్ కమిటీ నిర్ణయించింది. మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనకు సరిగ్గా 2023 కి 75 సంవత్సరాలు.నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న 19వ మహిళగా,2003లో ఈ అవార్డును గెలుచుకున్న మానవ హక్కుల కార్యకర్త షిరిన్ ఎబాది తర్వాత రెండవ ఇరాన్ మహిళ మహమ్మదీ కావడం గమనార్హం.

Advertisement

2019 హింసాత్మక ఘటనలోని బాధితురాలి స్మారకానికి హాజరైన తర్వాత ఇరాన్ ప్రభుత్వం మొహమ్మదీని అరెస్ట్ చేసింది. ప్రస్తుతం నర్గీస్ మొహమ్మదీ 31 సంవత్సరాల జీవితఖైదుని అనుభవిస్తున్నారు. మొహమ్మదీ యొక్క ధైర్యపోరాటానికి ఫలితం 13 సార్లు అరెస్టులు, 154 కొరడా దెబ్బలు,31 సంవత్సరాల ఖైదు. ఇదే సంవత్సరం ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ‘వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్’ బహుమతికి నర్గీస్ ఎంపికైంది.ఈ సంవత్సరానికి గానూ మొత్తం 351 నామినేషన్లు రాగా, ఈ అవార్డును నర్గీస్ మొహమ్మదీని ఎంపిక చేసారు.జైలు శిక్షకు ముందు, మొహమ్మదీ ఇరాన్‌లోని నిషేధించబడిన డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెంటర్‌కి వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

గత సంవత్సరం బహుమతిని ఉక్రెయిన్, బెలారస్ ,రష్యా నుండి మానవ హక్కుల కార్యకర్తలు గెలుచుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అతని బెలారసియన్ కౌంటర్, మిత్రదేశానికి బలమైన మందలింపుగా భావించబడింది. ఇంతకుముందుఈ బహుమతి పొందిన వారిలో ప్రముఖులైన నెల్సన్ మండేలా, బరాక్ ఒబామా, మిఖాయిల్ గోర్బచేవ్, ఆంగ్ సాన్ సూకీ ఉన్నారు.

Advertisement

నోబెల్ శాంతి బహుమతి దేశాల మధ్య సౌభ్రాతృత్వం కోసం, స్టాండింగ్ ఆర్మీలను రద్దు చేయడం లేదా తగ్గించడం కోసం; శాంతి కాంగ్రెస్ లను నిర్వహించడం, ప్రచారం చేయడానికి కృషి చేసిన వారికి ఇవ్వబడుతుంది. నోబెల్ శాంతి బహుమతి ప్రకటనలోని ప్రత్యేకత ఏమిటంటే ఈ శాంతి పురస్కారాన్ని ఐదుగురు సభ్యులతో కూడిన నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రకటిస్తుంది. మిగతా నోబెల్ బహుమతులు మాత్రం రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటిస్తుంది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×