E-Paper
Advertisement

Human Trafficking Case: హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు.. తెలుగు వారిపై అభియోగాలు.. వెనక్కి తీసుకున్న యూఎస్ పోలీసులు..

Human Trafficking Case: హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు.. తెలుగు వారిపై అభియోగాలు.. వెనక్కి తీసుకున్న యూఎస్ పోలీసులు..
Advertisement

Human Trafficking Case: యూఎస్ లోని న్యూజెర్సీ స్టేట్‌లో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో నలుగురు తెలుగువాళ్లను 2024 జులైలో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.. ఫేక్ కంపెనీలు సృష్టించి కొంతమందితో బలవంతంగా పనులు చేయించారని వారిపై ఆరోపణలు వచ్చాయి . అయితే తాజాగా ఆ నలుగురు తెలుగువాళ్లపై యూఎస్ పోలీసులు అభియోగాలను వెనక్కి తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలేం జరిగిందంటే..

గతేడాది మార్చి నెలలో న్యూజెర్సీ రాష్ట్రంలోని ప్రిన్సిటన్ అనే ప్రాంతంలో ఓ ఇంట్లో 15 మంది మహిళలను గుర్తించారు. వారందని అక్రమంగా యూఎస్ తీసుకుని వచ్చి బలవంతంగా పనులు చేయించారని.. వారి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందంటూ.. మనుషుల అక్రమ రవాణా కేసు కింద తెలుగు వాళ్లపై కోర్టులో కేసు నమోదు అయింది. ఈ కేసులో చందన్ దశిరెడ్డి, సంతోష్ కట్కూరి, ద్వారకా గుండా, అనిల్ మలెగా ను టెక్సాస్ పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో వారిపై పోలీసులు దాడులు కూడా నిర్వహించారు. అయితే ఈ కేసుపై ప్రిన్సిటన్ పోలీసులు కొద్ది రోజుల క్రితం తమ అభియోగాలను వెనక్కి తీసుకుంటున్నట్లు అటార్నీ కార్యాలయానికి లేఖ రాసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

Advertisement

అయితే .. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో చిక్కుకున్న 15 మంది మహిళలు ఓ మీడియాతో మాట్లాడుతూ.. తమను అక్రమంగా తీసుకొచ్చినట్లు గానీ, బలవంతంగా పనులు చేపించినట్లు గానీ చెప్పలేదు. దీంతో పోలీసులు తమ అభియోగాలను వెనక్కితీసుకున్నట్లు తెలుస్తోంది. డాలస్ న్యూస్ అనే వెబ్ సైట్ కొద్ది రోజుల క్రితం ఈ కథనాన్ని ప్రచురించింది. ఈ నలుగురు తెలుగువాళ్లపై అరెస్టు వారంట్లు జారీ చేసినప్పుడు బహిరంగా మీడియా ముందు ప్రకటన చేసిన ప్రిన్సిటన్ పోలీసులు.. ఇప్పుడు మాత్రం ఈ కేసు వివరాలను బయటకు చెప్పుకోలేదు. దీంతో పోయిన పరువును ఆ నలుగురు తెలుగువాళ్లకు ఎవరు తిరిగి ఇస్తారు అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.

Also Read: అమెరికాలో భారీగా పెరిగిన కోడిగుడ్ల ధరలు.. ట్రంప్ నిర్ణయాలే కారణమా?

Advertisement

అమెరికా ప్రిన్సిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఈ ఆరోపణలను ఎత్తివేసినట్లు, అరెస్టు వారెంట్లను తిరిగి పొందారని బహిరంగంగా చెప్పలేదని వెల్లడించింది. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు డిపార్ట్‌మెంట్‌లో ఒకరు ఈ విషయాన్ని తెలిపినట్లు కథనంలో ప్రచురింపబడింది. అయితే నలుగురు తెలుగువాళ్లపై ఆరోపణలు అవాస్తవమని తేలిన తరువాత .. ఆ విషయం ప్రిన్స్‌టన్ పోలీసులు బహిరంగంగా చెప్పాలని వారి తరఫు న్యాయవాది కోరినట్లు తెలుస్తోంది.

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×