E-Paper
Advertisement

అమెరికా దిగ్బంధం ఎఫెక్ట్.. సముద్రంలోకి ఇరాన్ చమురు, ఖార్గ్‌ ఐలాండ్ చుట్టూ నల్లటి తెట్టు

అమెరికా దిగ్బంధం ఎఫెక్ట్.. సముద్రంలోకి ఇరాన్ చమురు,  ఖార్గ్‌ ఐలాండ్ చుట్టూ నల్లటి తెట్టు
Advertisement

Kharg Island: ఇరాన్‌ను తనదారిని తెచ్చుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది అమెరికా. యుద్ధం వల్ల తీవ్ర నష్టమని భావించిన అగ్రరాజ్యం, ఇరాన్ అష్టదిగ్భంధం చేసింది. ఫలితంగా ఉత్పత్తి చేస్తున్న చమురు నిల్వలు నిండిపోయాయి. ఫలితంగా సముద్రంలోకి చమురును వదిలేస్తోంది. ఉపగ్రహ చిత్రాల ద్వారా వీటిని గుర్తించారు.

అమెరికా దిగ్బంధం ఎఫెక్ట్.. మరొక కొత్త సమస్య

Advertisement

తన దారికి తెచ్చుకునేందుకు ఇరాన్‌లోని అన్నిపోర్టులను దిగ్భంధనం చేసింది అమెరికా. దీంతో ఆ దేశం వెలికి తీస్తున్న చమురు అమ్ముకోలేకపోతున్న దానిని సముద్రంలో పారబోస్తున్నట్లు తెలుస్తోంది. చమురు బావుల్లో ఉత్పత్తి నిలిపితే ఏమైనా సమస్యలు వస్తాయని భావిస్తోంది ఇరాన్. చమురు నిల్వలు నిండిపోవడంతో వాటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నట్లు తెలుస్తోంది.

దీనికి సంబంధించి ఉపగ్రహ చిత్రాలను విశ్లేషిస్తూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇరాన్‌ చమురు ఎగుమతులకే కేరాఫ్ ఖార్గ్‌ ఐలాండ్. ఇప్పుడు ఆ ఐలాండ్ చట్టూ భారీగా నల్లటి తెట్టు తేలుతున్నట్టు కనిపించడం ఈ వార్తలకు బలం చేకూరింది. ఇరాన్ చమురు ఎగుమతులలో సుమారు 90 శాతం అక్కడి నుంచే జరుగుతాయి.

Advertisement

సముద్రంలోకి ఇరాన్ చమురు, ఖార్గ్‌ ఐలాండ్ చుట్టూ నల్లటి తెట్టు

ఆ చమురును హోర్ముజ్‌ మీదుగా విదేశాలకు ఎగుమతి చేస్తుంటుంది. అదే సమయంలో కాల్పులకు విరమణ ప్రకటించాయి అమెరికా-ఇరాన్. అదే సమయంలో హోర్ముజ్‌ జలసంధిని మూసేసినా చమురు నౌకలను తరలిస్తూ వచ్చింది. ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు జలసంధి బయట గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్ ఏరియాలో అమెరికా నౌకా విభాగం దిగ్బంధం విధించింది.

ఆ చమురును హోర్ముజ్‌ మీదుగా విదేశాలకు ఎగుమతి చేస్తుంటుంది. అదే సమయంలో కాల్పులకు విరమణ ప్రకటించాయి అమెరికా-ఇరాన్. అదే సమయంలో హోర్ముజ్‌ జలసంధిని మూసేసినా చమురు నౌకలను తరలిస్తూ వచ్చింది. ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు జలసంధి బయట గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్ ఏరియాలో అమెరికా నౌకా విభాగం దిగ్బంధం విధించింది.

ఇరాన్‌కు చెందిన చమురు నౌకలు ఏమీ బయటికి వెళ్లకుండా అడ్డుకోవడం మొదలైంది. దీంతో ఉత్పత్తి చేసిన చమురును వీలైనన్ని చోట్ల నిల్వ చేస్తూ వచ్చింది ఇరాన్. అవన్నీ నిండిపోవడంతో చమురును ఇరాన్‌ పర్షియన్‌ గల్ఫ్‌లో పారబోస్తూ ఉత్పత్తి చేస్తున్నట్లు వివిధ వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి.

ALSO READ: పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆత్మాహుతి దాడిలో 12 మంది జవాన్ల వీరమరణం

ఈ నేపథ్యంలో ఇరాన్ అత్యంత కీలకమైన ఇంధన ఎగుమతి కేంద్రంపై కొత్త ఆందోళనలు తలెత్తుతున్నాయి. ఈ లీక్‌కు గల కారణం అస్పష్టంగా ఉన్నాయి. ఖార్గ్ ద్వీపం లోని మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా గతంలో దాడులు చేసింది. ఈ లీక్‌ను గుర్తించడానికి కొన్నివారాల ముందు ఏప్రిల్ ఆరంభంలోనే దాడులు జరిగినట్లు తెలుస్తోంది.

నిల్వ ఉంచిన ముడి చమురు లీకేజీ ప్రమాదాలను పెంచుతోందని నిపుణులు చెబుతున్నారు. అబుజర్ క్షేత్రానికి వెళ్లే పాత సముద్ర గర్భ పైప్‌లైన్‌లో సంభవించే పగుళ్లు దీనికి మరో కారణంగా చెబుతున్నారు. ఇరాన్ దేశ చమురు ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోంది ఈ ప్రాంతం.

ఇక్కడి నుండి చైనా, ఆసియా దేశాల కొనుగోలు చేస్తాయి. అమెరికా దిగ్బంధనం కొనసాగితే ఇరాన్ ముడి చమురు నిల్వ సామర్థ్యం నిండుపోవచ్చని తాజా విశ్లేషణ సూచిస్తున్నాయి. ఖార్గ్ ద్వీపంలోని నిల్వలు కొద్ది రోజుల్లో పూర్తి సామర్థ్యానికి చేరుకోవచ్చని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ పేర్కొన్నట్లు అల్-జజీరా ఛానెల్ నివేదించింది.

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×