E-Paper
Advertisement

Texas Floods: టెక్సాస్ ఆగమాగం.. 50 మంది చిన్నారులు గల్లంతు!

Texas Floods: టెక్సాస్ ఆగమాగం.. 50 మంది చిన్నారులు గల్లంతు!
Advertisement
Texas Floods: అమోరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో కొన్ని రోజులుగా వరద భీభత్సం సృష్టిస్తుంది. ఒక్క నెలలో కురవాల్సిన వర్షాలు.. కేవలం కొన్ని గంటల్లో పడితే? అమెరికా టెక్సాస్​‌లో ఇదే జరిగింది. ఫలితంగా ఆ రాష్ట్రం అంతా అల్లకల్లోలంగా మారింది. అమెరికా టెక్సాస్ రాష్ట్రాన్ని భారీ వరదలు ముంచ్చెత్తాయి. నెల రోజులు కురువాల్సిన వర్షాలు.. కొన్ని గంటల్లోనే పడింది. వర్షాలు, వరదల కారణంగా 24మంది చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అనేక మంది గల్లంతయ్యారు. సమ్మర్ క్యాంపుకు వెళ్లిన 25మంది చిన్నారులు వరదల్లో కొట్టుకుపోయారు. ఎలాంటి ప్రమాద హెచ్చరికలు చేయకపోవడంతో భారీ ఆస్తినష్టం, ప్రాణ నష్టం జరిగిందని తెలుస్తోంది.
అతలాకుతలమవుతన్న టెక్సాస్..
గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు అతలాకుతలమైంది టెక్సాస్. మరోవైపు న్యూజెర్సీలో తుఫానుల కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో చెట్టు కూలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ విధ్వంసం కారణంగా ప్లెయిన్‌ఫీల్డ్ నగరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను రద్దు చేసింది. టెక్సాస్ హిల్ కంట్రీలో వరదలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. కొన్ని గంటల్లోనే ఇక్కడ ఒక నెల వర్షం కురిసింది. ఈ వర్షం విధ్వంసం సృష్టించి 24 మందిని బలిగొంది. అదే సమయంలో, శుక్రవారం నుండి 25 మందికి పైగా బాలికలు తప్పిపోయారు. ఈ బాలికలు వేసవి సెలవుల శిబిరంలో చేరడానికి వచ్చారు. వారి కోసం సహాయక బృందం వెతుకుతోంది.
వేగంగా పెరుగుతున్న వరద నీటి బృందాలు..
ఈ వినాశకరమైన వర్షం కారణంగా, టెక్సాస్ హిల్ కంట్రీలో వరదలు పోటెత్తాయి. నీటి మట్టం చాలా ఎక్కువగా ఉండటం వల్ల రోడ్లు మునిగిపోయాయి. వాహనాలు నీటమునిగాయి. ఇళ్ళు కూడా మునిగిపోయాయి. అధికారులు సహాయ చర్యలు ప్రారంభించారు. వేగంగా పెరుగుతున్న వరద నీటిలో బృందాలు పడవ, హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు చేపట్టాయి.
వరుసగా పెరుగుతున్న మరణాలు..
సెంట్రల్ కెర్ కౌంటీలో రాత్రిపూట కనీసం 10 అంగుళాల వర్షం కురిసింది. దీని వలన గ్వాడాలుపే నది వెంబడి ఆకస్మిక వరదలు సంభవించాయి. శుక్రవారం(జూలై 04) రాత్రి జరిగిన విలేకరుల సమావేశంలో, కెర్ కౌంటీ షెరీఫ్ లారీ లీథా 24 మంది మరణించారని తెలిపారు. ఇప్పటివరకు 237 మందిని రక్షించామని, వారిలో 167 మందిని హెలికాప్టర్ ద్వారా రక్షించామని అధికారులు తెలిపారు.
తప్పిపోయిన వారిలో కొందరు పెద్దలు, మరికొందరు పిల్లలు ఉన్నారని లెఫ్టినెంట్ గవర్నర్ డాన్ పాట్రిక్ అన్నారు. డజన్ల కొద్దీ రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తప్పిపోయిన వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. టెక్సాస్ ప్రజలు తప్పిపోయిన 25 మంది బాలికలు సురక్షితంగా బయటపడాలని అభ్యర్థిస్తున్నానని ఎల్జీ పాట్రిక్ అన్నారు. 400 మంది సహాయ, సహాయ చర్యలు చేపడుతున్నారని పాట్రిక్ చెప్పారు. అదే సమయంలో 9 రెస్క్యూ టీమ్‌లు, 14 హెలికాప్టర్లు, 12 డ్రోన్‌లను ఉపయోగిస్తున్నారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×