E-Paper
Advertisement

PM Modi: ఎన్డీఏ హ్యాట్రిక్.. ప్రధాని మోదీకి దేశాధినేతల శుభాకాంక్షలు

PM Modi: ఎన్డీఏ హ్యాట్రిక్.. ప్రధాని మోదీకి  దేశాధినేతల శుభాకాంక్షలు
Advertisement

World Leaders Wishes to PM Modi: లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి మూడో సారి మోదీ ప్రధాని పీఠం ఎక్కేందుకు సిద్ధమైన సందర్భంగా మోదీకి వివిధ దేశాల అధినేతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఎక్స్ వేదికగా మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.

భారత్, ఇటలీ మధ్య స్నేహ బంధాన్ని బలోపేతం చేయడానికి, రెండు దేశాల ప్రజల శ్రేయస్సు కోసం పరస్పర సహకారం దిశగా కలిసి పనిచేయాలని మెలోనీ పేర్కొన్నారు. పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంక, భూటాన్‌తో పాటు పలువురు దేశాల అధినేతలు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

కలిసి పనిచేద్దాం..
మోదీ నాయకత్వంలో సాధించిన ప్రగతి, శ్రేయస్సుపై భారత ప్రజలు నమ్మకాన్ని చూపించారని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్కమ సింఘె ఎక్స్ వేదికగా తెలిపారు. భారత్‌తో భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు శ్రీలంక ఎదురు చూస్తోందని ట్వీట్ చేశారు. అంతే కాకుండా సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించినందుకు ప్రధాని మోదీకి మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మెయిజ్జు అభినందనలు తెలిపారు. భారత్ మాల్దీవుల మధ్య స్నేహ బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఎదరుచేస్తున్నా.. అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

Advertisement

పురోగతి సాధిస్తూనే ఉండాలి

నేపాల్ పీఎం కమల్ దహల్ ప్రచండ మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఎక్స్ వేదికగా మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. నేపాల్‌ పీఎంతో పాటు భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్‌గే కూడా మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు. చారిత్రాత్మకంగా మూడో సారి విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. మారిషస్ ప్రధాని ప్రవింద కుమార్ కూడా మోదీకి అభినందనలు తెలిపారు. మోదీ నేతృత్వంలో భారత్ విశేష పురోగతి సాధిస్తూనే ఉంటుందని అన్నారు.

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×