E-Paper
Advertisement

Nepal: నేపాల్‌లో కుప్పకూలిన విమానం.. భారతీయులతో సహా భారీగా మృతుల సంఖ్య..

Nepal: నేపాల్‌లో కుప్పకూలిన విమానం.. భారతీయులతో సహా భారీగా మృతుల సంఖ్య..
Advertisement

Nepal: ఎయిర్ పోర్టులో విమానం టేకాఫ్ కు రెడీగా ఉంది. విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. అంతా సీట్ బెల్ట్ పెట్టుకున్నారు. కౌంట్ డౌన్ మొదలైపోయింది. విమానం గాల్లో ఎగిరింది. అంతా రిలాక్స్ అయ్యారు. కాసేపట్లో గమ్యానికి చేరుకుంటామనగా.. ఉన్నట్టుండి విమానం కుదుపులకు లోనైంది. ప్రయాణికులు టెన్షన్ పడ్డారు. ఏమందో ఏమోనని హడలిపోయారు. అంతలోనే విమానం కుప్పకూలింది. భారీగా మంటలు చెలరేగాయి. 45 మందికి పైగా మృతి చెందినట్టు తెలుస్తోంది. మృతుల్లో ఐదుగురు భారతీయులు ఉన్నారంటున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

కాఠ్‌మాండూ నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారాకు బయల్దేరిన యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏటీఆర్‌ 72 విమానం కుప్పకూలింది. ఈ ఘటన పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగింది. ఒక్క రెక్క మినహా విమానం మొత్తం కాలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న వారు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడే అవకాశాలు చాలా తక్కువని చెబుతున్నారు. ఆ విమానంలో 10 మంది విదేశీయులు ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

ప్రమాదంపై నేపాల్‌ ప్రధాని పుష్ప కమల్‌ దహల్‌ విచారం వ్యక్తం చేశారు. అత్యవసర మంత్రి వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భద్రతా దళాలు, హోంశాఖ వెంటనే సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేపాల్ విమాన ప్రమాదంతో పలు భారతీయ కుటుంబాల్లో విషాదం నెలకొంది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×