E-Paper
Advertisement

Pakistan: గోధుమ పిండికోసం తొక్కిసలాట.. పాక్‌లో 11 మంది దుర్మరణం

Pakistan: గోధుమ పిండికోసం తొక్కిసలాట.. పాక్‌లో 11 మంది దుర్మరణం
Advertisement

Pakistan: ఆర్థిక సంక్షోభంతో అల్లకల్లోలం అవుతుంది పాకిస్థాన్. తినడానికి తిండిలేక.. నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి జనాలు అల్లాడిపోతున్నారు. కనీస అవసరాలు తీర్చుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆకలితో అలమటిస్తున్నారు. ఈక్రమంలో అక్కడి ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా గోధమ పిండి పంపిణీ చేస్తండగా.. తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆకలితో అలమటిస్తున్న జనాలకు ఉచితంగా గోధుమ పిండి పంపిణీ చేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈక్రమంలో గోధుమ పిండి లోడ్‌తో కూడిన లారీని పంజాబ్ ప్రావిన్స్‌కు పంపించింది. అయితే జనాలు ఒక్కసారిగా ఆ లారీపైకి ఎగబడ్డారు. రన్నింగ్ ఉన్న లారీ ఎక్కి గోధుమ పిండి బస్తాలను తీసుకునేందుకు ప్రయత్నించారు.

Advertisement

ఈక్రమంలో తొక్కిసలాట జరిగి దాదాపు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి పైగా గాయపడ్డారు. పంజాబ్ ప్రావిన్స్‌తో పాటు ముజఫర్‌గఢ్, ఒఖారా, జెహానియాన్, ఫైసలాబాద్ ప్రాంతాల్లో కూడా తొక్కిసలాట చోటుచేసుకుంది. గాయపడిని వారికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం తొక్కిసలాటకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైలరవుతున్నాయి.

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×