E-Paper
Advertisement

Pakistan Terror Attack : పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌పై ఉగ్ర దాడి.. మూడు యుద్ధ విమానాలు ధ్వంసం.. 3 తీవ్రవాదులు మృతి

Pakistan Terror Attack : పాకిస్తాన్‌లోని ఓ ఆర్మీ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు శనివారం దాడి చేశారు. ఈ దాడితో మూడు యుద్ధ విమానాలను ధ్వంసం అయ్యాయి. పాకిస్తాన్ సైన్యం వెంటనే ఎదురుదాడి ప్రారంభించింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గరు ఉగ్రవాదులు చనిపోయారని సమాచారం.

Pakistan Terror Attack : పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌పై ఉగ్ర దాడి.. మూడు యుద్ధ విమానాలు ధ్వంసం.. 3 తీవ్రవాదులు మృతి
Advertisement

Pakistan Terror Attack : పాకిస్తాన్‌లోని ఓ ఆర్మీ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు శనివారం దాడి చేశారు. ఈ దాడితో మూడు యుద్ధ విమానాలను ధ్వంసం అయ్యాయి. పాకిస్తాన్ సైన్యం వెంటనే ఎదురుదాడి ప్రారంభించింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గరు ఉగ్రవాదులు చనిపోయారని సమాచారం.

పాకిస్తాన్ దేశంలోని పంజాబ్ ప్రాంతంలో ఉన్న మియావాలి ఎయిర్‌బేస్‌లో ఈ ఘటన జరిగింది. పాకిస్తాన్ సైన్యం తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం ఆరుగురు టెర్రరిస్టులు ఎయిస్‌బేస్ కాంపౌండ్ గోడపై నిచ్చెన సహాయంతో ఎక్కారు. అక్కడ ఉన్న కంచు వైర్లను కట్ చేసి లోపలికి చొరబడ్డారు. ఆ తరువాత తుపాకులు పేలుస్తూ, బాంబులు విసిరారు. దీంతో అక్కడ నిప్పు రాజుకుంది.

Advertisement

ఇది చూసిన పాక్ సైనికులు ఎదురుదాడి చేయగా.. ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. మరో ముగ్గురు అదే ప్రాంతంలో దాగి ఉన్నారని తెలిసింది. వారి కోసం సైన్యం గాలిస్తోంది. ఉగ్రవాదులు చేసిన బాంబు దాడిలో ఎయిర్‌బేస్‌లోని మూడు విమానాలు దెబ్బతిన్నాయి. వాటిలో ఇంధన ట్యాంకులకు అగ్గిరాజుకోవడంతో భారీపేలుడు సంభవించిందని సమాచారం.

అయితే దాడి చేసిన టెర్రరిస్టులు ‘తహరీకె జిహాద్ పాకిస్తాన్’ అనే ఉగ్ర సంస్థకు చెందిన వారని తెలిసింది. అధికారికంగా ఈ విషయం ఆ ఉగ్రసంస్థ ధృవీకరించనప్పటికీ.. ఆ సంస్థ నాయకుడు ముల్లా ముహమ్మద్ కొన్ని రోజుల ముందే ఒక దాడి చేయబోతున్నట్లు హెచ్చరికలు చేశాడు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×