E-Paper
Advertisement

Musharraf: పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కన్నుమూత

Musharraf: పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కన్నుమూత
Advertisement

Musharraf: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు. ముషారఫ్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈక్రమంలో దుబాయ్‌లోని అమెరికన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యల కారణంగా ఆయన 2016 నుంచి దుబాయ్‌లోనే ఉంటున్నారు. ముషారఫ్ మరణం పట్ల పలువురు దేశాధినేతలు సంతాపం తెలియజేస్తున్నారు.

1943లో ఢిల్లీలో జన్మించిన ముషారఫ్.. దేశ విభజన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి పాకిస్థాన్ వెళ్లిపోయారు. ఆ తర్వాత సైన్యంలో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ పాక్ సైనికదళాల ప్రధానాధికారిగా పనిచేశారు. ఆతర్వాత 1999లో నవాజ్ షరీఫ్ సర్కార్‌పై తిరుగుబాటు చేసి సైనిక పాలకుడిగా పదవి దక్కించుకున్నారు. కార్గిల్ యుద్ధానికి ప్రధాన కారకుడు ఆయనే. 2001లో పాకిస్థాన్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన ముషారఫ్..2008 వరకు ఆ పదవిలో కొనసాగారు.

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×