E-Paper
Advertisement

Noida Fire Accident: తెల్లవారుజామున అగ్నిప్రమాదం.. నిద్రలోనే ముగ్గురు చిన్నారుల సజీవ దహనం

Noida Fire Accident: తెల్లవారుజామున అగ్నిప్రమాదం.. నిద్రలోనే ముగ్గురు చిన్నారుల సజీవ దహనం
Advertisement

Noida Fire Accident news(Today’s news in telugu): నోయిడాలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మురికి వాడలోని ఓ ఇంట్లో బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నిద్రలో ఉన్న ముగ్గురు బాలికలు సజీవ దహనం చెందారు. అలాగే ఆ బాలిక తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో తీవ్ర విషాదం నెలకొంది.

ఇంట్లో పిల్లలతో పాటు తల్లిదండ్రులు నిద్రిస్తుండగా..ప్రమాదం చోటుచేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఆస్తా(10), నైనా(7), ఆరాధ్య(5)లు నిద్రల్లోనే మృతిచెందారు. తొలుత అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో బాలికలు తప్పించుకునేందుకు ప్రయత్నించినా వీలు కాలేదని తల్లిదండ్రులు వాపోయారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

Advertisement

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ముగ్గురు బాలికల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులను నోయిడా జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలికల తండ్రి దౌలత్ రామ్(32) తీవ్రంగా గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి తరలించారు.

Also Read: విషాదం.. బోరు బావిలో పడి మూడేళ్ల చిన్నారి మృతి

Advertisement

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లోని ఓ గదిలో బ్యాటరీ చార్జింగ్ పెట్టగా..షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య జరిగిందని స్థానకులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే రెండు అగ్నిమాపక వాహనాలతో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ఈ ప్రమాదంపై ఫోరెన్సిక్ బృందం దర్యాప్తు చేపట్టింది. ప్రమాదం జరగకముందు ఇంట్లో ఐదుగురు నిద్రిస్తున్నట్లు తేలింది. అయితే మంచంపై నిద్రిస్తున్న ముగ్గురు బాలికలకు తీవ్రంగా గాయాలై చనిపోగా.. దౌలత్ రామ్(32)కు 70 శాతం వరకు తీవ్రంగా గాయపడడంతో ఆయనకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. దౌలత్ రామ్ భార్య స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×