E-Paper
Advertisement

NOBEL PRIZE : రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారం వీరికే!

NOBEL PRIZE : రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారం వీరికే!
Advertisement

రాయల్ స్వీడిష్ అకాడమీ ఈ ఏడాది రసాయన శాస్త్రంలో(chemistry) నోబెల్ పురస్కారానికి(Nobel Prize) ముగ్గురిని ఎంపిక చేసింది. ఈ ముగ్గురూ అమెరికాకి చెందిన వారే కావడం విశేషం.అవార్డు పొందిన వారిలో మౌంగి జి.బావెండీ, లూయస్ ఈ బ్రూస్, అలెక్సీ ఎకిమోవ్ ఉన్నారు.నానోటెక్నాలజీలో క్వాంటమ్ డాట్స్ ఆవిష్కరణలో వీరు చేసిన పరిశోధనలకు గానూ వీరికి ఈ సంవత్సరం నోబెల్ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది.

ఇందులో లూయస్ ఈ బ్రూస్ మరియు అలెక్సీ ఎకిమోవ్ 1980లో క్వాంటమ్ డాట్స్ మరియు వాటి యొక్క లక్షణాలకు సంబంధించి విడివిడిగా పరిశోధనలు చేసి విజయవంతమయ్యారు.1993లో మౌంగి బావెండీ క్వాంటమ్ డాట్స్ తయారుచేసే పద్దతుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు.క్వాంటమ్ డాట్స్ నాణ్యతను మెరుగుపరిచారు. నేటి నానోటెక్నాలజీలో వాటి ఉపయోగం కోసం ఇది చాలా ముఖ్యం.
క్వాంటమ్ డాట్స్ అనేవి ప్రస్తుతం QLED టెక్నాలజీ ఆధారంగా కంప్యూటర్ మానిటర్లు,టి.వి స్క్రీన్ లను ప్రకాశిస్తాయి.జీవరసాయన శాస్త్రవేత్తలు,వైద్యులు జీవ కణజాలాన్ని మ్యాప్ చేయడానికి వీటిని ఉపయోగిస్తారు.

Advertisement

క్వాంటమ్ డాట్స్ అనేవి నేటి ఆధునిక యుగంలో మానవజాతికి గొప్ప ప్రయోజనాన్ని తెస్తున్నాయి.భవిష్యత్తులో ఈ క్వాంటమ్ డాట్స్ సౌకర్యవంతమైన ఎలక్ట్రానిక్స్ పరికరాలు, చిన్న సెన్సార్లు, సన్నని సౌరఘటాలు,ఎన్క్రిప్టెడ్ క్వాంటం కమ్యూనికేషన్ కు దోహదం చేస్తాయని పరిశోధకులు విశ్వసిస్తున్నారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×