E-Paper
Advertisement

Muhammad Yunus : మహ్మద్ యూనస్ దోషే.. న్యాయస్థానం సంచలన తీర్పు..

MuhammadYunus arrest : కార్మిక చట్టాల ఉల్లంఘన కేసులో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ఆర్థికవేత్త మహ్మద్ యూనస్‌(83)ను బంగ్లాదేశ్ కోర్టు దోషిగా తేల్చింది. అతనికి ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. అయితే ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అంటూ యూనస్ మద్దతుదారులు మండిపడుతున్నారు. తన మైక్రోఫైనాన్సింగ్ బ్యాంక్ ద్వారా లక్షలాది మందిని దారిద్ర్యం నుంచి బయటపడేసిన ఘనత యూనస్‌ది. సుదీర్ఘకాలం ప్రధానిగా ఉన్న షేక్ హసీనాతో శత్రుత్వం కారణంగా పేదల రక్తాన్ని తాగే వ్యక్తిగా ఆయనపై దుష్ప్రచారం సాగింది.

Muhammad Yunus : మహ్మద్ యూనస్ దోషే.. న్యాయస్థానం సంచలన తీర్పు..
Advertisement

Muhammad Yunus : కార్మిక చట్టాల ఉల్లంఘన కేసులో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ఆర్థికవేత్త మహ్మద్ యూనస్‌(83)ను బంగ్లాదేశ్ కోర్టు దోషిగా తేల్చింది. అతనికి ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. అయితే ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అంటూ యూనస్ మద్దతుదారులు మండిపడుతున్నారు. తన మైక్రోఫైనాన్సింగ్ బ్యాంక్ ద్వారా లక్షలాది మందిని దారిద్ర్యం నుంచి బయటపడేసిన ఘనత యూనస్‌ది. సుదీర్ఘకాలం ప్రధానిగా ఉన్న షేక్ హసీనాతో శత్రుత్వం కారణంగా పేదల రక్తాన్ని తాగే వ్యక్తిగా ఆయనపై దుష్ప్రచారం సాగింది.

తన రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తూ యూనస్‌పై పలు అంతర్జాతీయ వేదికలపై హాసినా ఘాటైన విమర్శలు, ఆరోపణలు కూడా చేశారు. 2006లో నోబెల్ పురస్కారాన్ని పొందిన యూనస్ అనేక సంస్థలను స్థాపించారు. వాటిలో గ్రామీణ్ టెలికాం ఒకటి. ఆ కంపెనీలో ఉద్యోగుల సంక్షేమ నిధి ఏర్పాటుకు సంబంధించి యూనస్, మరో ముగ్గురు సహచరులు కార్మిక చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన కేసులో ఢాకాలోని లేబర్ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. కార్మికచట్టాల ఉల్లంఘన, అవినీతి తదితర ఆరోపణలకు సంబంధించి వందకు పైగా అభియోగాలను యూనస్ ఎదుర్కొంటున్నారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×