E-Paper
Advertisement

Nigeria explosion: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం, మంటల్లో 48 మంది మృతి.. ఎలా జరిగింది?

Nigeria explosion: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం, మంటల్లో 48 మంది మృతి.. ఎలా జరిగింది?
Advertisement

Nigeria explosion: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం  చోటు చేసుకుంది. ఈ ఘటనలో 48 మంది సజీవ దహనమయ్యారు. మరో 50 వరకు పశువులు మృతి చెందాయి. ఈ విషయాన్ని ఆ దేశ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
ఈ ఏడాదిలో అక్కడ జరిగిన ఘటనల్లో ఇదే అతిపెద్దది.

నైజీరియాలో నార్త్- మధ్య నైజర్ రాష్ట్రంలోని ఆగాయి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఓ ఆయిల్ ట్యాంకర్ ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ మంటలు చుట్టుపక్కన వాహనా లకు అట్టుకున్నాయి. ట్రక్కులో ఉన్న 50 పశువులు సజీవ దహనమయ్యాయి. ఈ ప్రమాదంలో 48 మంది మృతి చెందారు.

Advertisement

ALSO READ: నిన్న చైనా.. ఇప్పుడు వియత్నాం.. యాగి తుపాను బీభత్సంతో 14 మంది మృత్యువాత

ఆయిల్ ట్రక్కులో ఉన్న వ్యక్తులతోపాటు చుట్టుపక్కన వాహనాలకు సంబందించిన వ్యక్తులు కూడా ఈ ఘటనలో ఉన్నట్లు ఆ దేశ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయి. మొదట్లో 30 మంది సజీవ దహనమయ్యారు. మరో 18 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి.

Advertisement

మృతులకు సమీపంలోని ఓ ప్రాంతంలో సామూహిక అంత్యక్రియలు నిర్వహించినట్టు పేర్కొంది. నైజీరియాలో సరైన రైల్వే వ్యవస్థ లేదు. ముఖ్యంగా కార్గో రవాణాకు కేవలం వాహనాలు మాత్రమే వినియోగిస్తున్నారు. ఆఫ్రికాలో అత్యధిక జనాబా కలిగిన నైజీరియాలో ఆ తరహా ప్రమాదాలు సాధారణంగా చెబుతున్నారు.

దీనికితోడు రోడ్లు సరిగా లేకపోవడంతో ప్రతీ ఏడాది వందల సంఖ్యలో మనుషులు మరణించిన సందర్భాలు కోకొల్లలు. నైజీరియాలోని ఫెడరల్ రోడ్ సేఫ్టీ అధికారుల నివేదిక ప్రకారం.. 2020లో 1530 ట్యాంకర్ల ప్రమాదాలు జరిగాయి. మొత్తం 535 మంది మరణించారు.  మరో 1142మంది గాయపడ్డారు.

ఈ ఘటనపై నైజర్ ప్రాంత గవర్నర్ మహమ్మద్ బాగో నోరు విప్పారు. వాహనదారులు జాగ్రత్త పాటించాలని తరుచు చెబుతున్నామని వెల్లడించారు. అనుకోకుండా ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలిపారు. ప్రజలు రోడ్డు ట్రాఫిక్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని మరోసారి కోరుతున్నారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×