E-Paper
Advertisement

Moulana Rahimullah Tariq : పాకిస్తాన్ ఉగ్రవాది మౌలానా రహీముల్లా తారిఖ్ హత్య!

Moulana Rahimullah Tariq : పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్‌కు చెందిన మత గురువు మౌలానా రహీముల్లా తారిఖ్ సోమవారం హత్యకు గురయ్యాడు. జైషే మొహమ్మద్‌ అధ్యక్షుడు మసూద్ అజ్హర్‌కు రహీముల్లా తారిఖ్‌ సన్నిహితుడు.

Moulana Rahimullah Tariq : పాకిస్తాన్ ఉగ్రవాది మౌలానా రహీముల్లా తారిఖ్ హత్య!
Advertisement

Moulana Rahimullah Tariq : పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్‌కు చెందిన మత గురువు మౌలానా రహీముల్లా తారిఖ్ సోమవారం హత్యకు గురయ్యాడు. జైషే మొహమ్మద్‌ అధ్యక్షుడు మసూద్ అజ్హర్‌కు రహీముల్లా తారిఖ్‌ సన్నిహితుడు.

సోమవారం, నవంబర్ 13న, మౌలానా రహీముల్లా తారిఖ్ ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొనడానికి కరాచీ నగరంలోని ఓరంగీ టౌన్‌కు వెళుతున్నప్పుడు మార్గమధ్యంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌ మీద వచ్చి ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో రహీముల్లా తారిఖ్ అక్కడే మరణించాడు.

Advertisement

కొద్ది రోజుల క్రితమే పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ అక్రమ్ ఖాన్ ఘాజీని కాల్చి చంపారు. ఈ ఘటన జరిగిన వారం రోజులకే రహీముల్లా తారిఖ్ హత్య జరగడంతో ఈ వరుస హత్యలు ఒకే సంస్థ చేయిస్తోందని అనుమానాలు కలుగుతున్నాయి.

భారతదేశంలో ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్‌ ఇంతకుముందు రెండుసార్లు పెద్ద దాడులు చేసింది. 2001లో పార్లమెంటుపై దాడి, ఆ తరువాత 2019లో పుల్వామా అటాక్ ఘటనలలో జైషే మొహమ్మద్‌ ఉగ్రవాదులే కారణం.

Advertisement

13 డిసెంబర్, 2001 సంవత్సరంలో పార్లమెంట్ శీతకాల సమావేశాలు జరుగుతున్నప్పుడు అయిదుగురు ఉగ్రవాదులు దాడి చేశారు. అందులో ఒకడు పార్లమెంటు గేటు వద్ద ఆత్మాహుతి దాడి చేసుకున్నాడు. ఆ తరువాత నలుగురు ఉగ్రవాదులను సెక్యూరిటీ బలగాలు కాల్చి చంపాయి. ఈ ఉగ్రవాద దాడికి జైషే మొహమ్మద్‌, లష్కరే తయ్యబా సంయుక్తంగా చేశాయి.

ఆ తరువాత 2019 సంవత్సరం, ఫిబ్రవరి 14న పుల్వామా దాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది భారత సైనికులు చనిపోయిన విషయం తెలిసిందే.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×