E-Paper
Advertisement

Maldives: ఇక నుంచి ఈ దేశం పోవడం కష్టమే..?

Maldives: ఇక నుంచి ఈ దేశం పోవడం కష్టమే..?
Advertisement

to ban israeli passport holders: గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ప్రపంచ దేశాలు నిరసిస్తున్నాయి. మాల్దీవుల్లోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో స్థానికంగా ప్రజాగ్రహాన్ని చల్లార్చేందుకు ఆ దేశం కీలక చర్యలకు నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ పాస్ పోర్ట్ ఉన్నవారికి తమ దేశంలో ప్రవేశాన్ని నిషేధించాలని సిద్ధమైంది. ఆ దేశ హోంమంత్రి అలీ ఇహుసన్ ఈ విషయాన్ని వెల్లడించినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. మరోవిషయం ఏమంటే.. గాజాలోని పాలస్తీనియన్లకు సాయం చేసేందుకు నిధుల సేకరణ కార్యక్రమాలు చేపట్టేందుకు ముందుకొచ్చినట్లు కూడా పేర్కొన్నది.

‘ఇజ్రాయెల్ పాస్ పోర్ట్ పై మాల్దీవుల్లోకి ప్రవేశాన్ని వీలైనంత త్వరగా నిషేధించేందుకు అవసరమైన చట్టపరమైనటువంటి సవరణలు చేయాలని దేశ మంత్రివర్గం నిర్ణయించింది. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది’ అంటూ హోం మంత్రి చెప్పారు.

Advertisement

Also Read: వేలంలో లేఖలు.. అందులో ఆమె వ్యక్తిగత విషయాలు కూడా..

ఇదిలా ఉంటే.. ఇజ్రాయెల్ నుంచి మాల్దీవులకు ప్రతి ఏటా దాదాపుగా 15 వేల మందికి పైగా పర్యాటకులు సందర్శిస్తుంటారు. గతేడాది అక్టోబర్ లో 7న హమాస్ దాడులకు ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్న విషయం విధితమే. టెలి అవీవ్ దాడుల్లో ఇప్పటివరకు 36 వేల మందికిపైగా మృతిచెందారు. ఈ క్రమంలో ప్రపంచ దేశాలన్నీ కూడా దాడులను ఆపాలని ఇజ్రాయెల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×