E-Paper
Advertisement

LIBYA Boat Accident : డెత్ జర్నీ.. లిబియా తీరంలో ఘోర బోటు ప్రమాదం.. 61 మంది మృతి!

LIBYA Boat Accident : డెత్ జర్నీ.. లిబియా తీరంలో ఘోర బోటు ప్రమాదం.. 61 మంది మృతి!
Advertisement

LIBYA Boat Accident : యుద్ధాలు.. పేదరికం.. ఆకలి.. వీటి నుంచి తప్పించుకోవాలనుకున్న ఆ వలసదారుల బతుకులు సముద్రం పాలయ్యాయి. ఉత్తర ఆఫ్రియా దేశమైన లిబియా తీరంలో పడవ మునిగి ఏకంగా 61 మంది మృతి చెందారు. వీరంతా లిబియా తీరంలోని జువారా నుంచి బయలుదేరి యూరప్‌ తీరానికి చేరుకోవాలనుకున్నారు. కానీ భయంకరమైన అలల తాకిడికి తట్టుకోలేక పడవ నీటిలో మునిగి వలసదారులు మరణించారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ తెలిపింది.

వీరంతా నైజీరియా, జాంబియాతో పాటు ఇతర ఆఫ్రికన్ దేశాలకు చెందిన మహిళలు, పిల్లలు సహా మొత్తం 86 మంది వలసదారులు ప్రమాద సమయంలో ఆ బోటులో ఉన్నట్టు తెలిపింది. మిగిలిన 25 మందిని రక్షించిన కోస్ట్ గార్డ్స్‌ లిబియా డిటెన్షన్‌ సెంటర్‌కి తరలించినట్లు IOM తెలిపింది.

Advertisement

ప్రాణాలతో బయటపడిన వారందరూ సురక్షితంగా ఉన్నారని IOM తెలిపింది. లిబియా, ట్యునీషియా ఇటలీ మీదుగా యూరప్‌కు చేరుకోవాలని వలసదారులు ప్లాన్ చేశారు. ఈ ఏడాది ట్యునీషియా, లిబియా నుంచి లక్షా 53 వేల మంది కంటే ఎక్కువ వలసదారులు ఇటలీకి చేరుకున్నారు. అయితే 2 వేల మందికి పైగా అనేక ప్రమాదాల కారణంగా మృతి చెందారు.

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×