E-Paper
Advertisement

Israel Attack on Hamas Camp: గాజాపై మరోసారి ఇజ్రాయెల్ దాడి.. 27మంది మృతి

Israel Attack on Hamas Camp: గాజాపై మరోసారి ఇజ్రాయెల్ దాడి.. 27మంది మృతి
Advertisement

Israel Attack on Hamas Camp: గాజాపై ఇజ్రాయెల్ మరోసారి దాడికి పాల్పడింది. హమాస్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడులకు తెగపడుతోంది. అంతర్జాతీయ నిబంధనలను అతిక్రమిస్తూ మరణహోమం సృస్టిస్తోంది. తాజాగా, సెంట్రల్ గాజాలోని ఓ పాఠశాల భవనంపై ఇజ్రాయెల్ సైన్యం విచక్షణారహితంగా బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో 27 మంది మృతి చెందగా.. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే మృతుల్లో 5మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని అంబులెన్స్‌లో రెస్క్యూ బృందాలు ఆస్పత్రులకు తరలిస్తున్నాయి. అయితే హమాస్, ఇస్లామిక్ జిహాద్ వంటి సంస్థలు ఈ పాఠశాలను తమ పనుల కోసం ఉపయోగించుకుంటున్నట్లు ఇజ్రాయెల్ సైనం చెబుతోంది. కానీ, దీనిపై ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు.

ఖండించిన అంతర్జాతీయ సంస్థలు

Advertisement

ఇజ్రాయెల్, హమాస్ మధ్య గత కొంతకాలంగా యుద్ధం కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో సెంట్రల్ గాజాలోని 5 ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది. ఈ యుద్ధం కారణంగా నిరాశ్రయులైన వారికి ఈ పాఠశాలలు ఆశ్రయం కల్పిస్తున్నాయి. అలాంటి పాఠశాలలపై దాడికి పాల్పడడంతో అంతర్జాతీయ సంస్థలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ యుద్ధం రోజురోజుకు పెరిగిపోతుండడంతో ఇరాన్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. గాజాపై ఇజ్రాయెల్ బాంబుల దాడులను ఆపకపోతే యుద్ధం మొదలయ్యే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది.

Also Read: ప్రపంచంలో బర్డ్ ఫ్లూతో తొలి మృతి నమోదు.. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలంటూ అలర్ట్

Advertisement

వెనక్కి రావాలని సూచన

గాజాపై ఇజ్రాయెల్‌ గ్రౌండ్‌ ఆపరేషన్‌ మొదలు పెట్టేందుకు సిద్ధమవుతోంది. దీంతో నార్త్ గాజాలో ఉన్న 11 లక్షలమంది పాలస్తీనా ప్రజలు అక్కడినుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ మేరకు యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున గాజా బార్డర్ నుంచి బలగాలను వెనక్కి రప్పించాలని ఇజ్రాయెల్‌కు ఇరాన్ ప్రభుత్వం సూచించింది. గాజాపై మళ్లీ ఇజ్రాయెల్ దాడులు చేస్తే.. పెద్ద ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. కాగా, గాజాలోని హమాస్, లెబనాన్‌లోని హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థలకు ఇరాన్ ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. మరోవైపు 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడికి పాల్పడిన వారికి సెంట్రల్ గాజాలోని పాఠశాల ఆశ్రయంగా ఉందని తెలుస్తోంది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×