E-Paper
Advertisement

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు
Advertisement

Kuwait Airport: పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. తాజాగా కువైట్ లోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుపై మిస్సైళ్లతో విరుచుకుపడింది ఇరాన్.  ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. పరిస్థితి గమనించిన  ఎయిర్ పోర్టు అథారిటీ..   విమాన రాకపోకలను నిలిపి వేసింది. ఈ విషయాన్ని కువైట్ అధికారులు వెల్లడించారు.

కువైట్‌ ఎయిర్‌పోర్ట్ పై ఇరాన్ భీకర దాడులు

Advertisement

గల్ఫ్‌లో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రమయ్యాయి. బుధవారం వేకువ జామున నుంచి ఇరాన్ దాడులు మొదలుపెట్టింది. ముఖ్యంగా అమెరికా స్థావరాలపై ఫోకస్ చేసిన ఇరాన్, తీవ్రంగా దెబ్బకొట్టింది. తాజాగా బుధవారం మధ్యాహ్నం కువైట్ ఎయిర్‌పోర్టుపై డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులకు దిగింది. దీంతో ఎయిర్ పోర్టులో మంటలు చెలరేగాయి.

ఎటు చూసినా బూడిద రంగు వాతావరణం కనిపించడంతో అక్కడ ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపు నష్టం జరిగిపోయింది. ఈ దాడులు పలువురు గాయపడినట్టు అంతర్జాతీయ మీడియలో కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కువైట్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన విమానాలను అధికారులు రద్దు చేశారు.

Advertisement

ఎగిసిపడిన మంటలు.. ప్రయాణికులు పరుగులు, పలు విమాన సర్వీసులు రద్దు

ఈ దాడిలో ఎయిర్‌పోర్టు ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆ దేశ సైన్యం వెల్లడించింది. ఈ నేపథ్యంలో విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ప్రకటించింది. పలు విమానాల రాకపోకలను నిలిపి వేసింది. ఈ విషయాన్ని కువైట్ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ వెల్లడించింది. అక్కడికి రావాల్సిన పలు విమానాలను ఇతర ప్రాంతాలకు మళ్లించినట్లు తెలియజేసింది.

దాడుల కారణంగా కువైట్ అధికారులు వెంటనే దేశ గగనతలాన్ని మూసివేశారు. విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  భద్రతా తనిఖీలు పూర్తయ్యే వరకు కార్యకలాపాలు నిలిపి వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇరాన్‌లోని పలు దీవులపై గడిచిన నాలుగైదు రోజులుగా అమెరికా వైమానిక దాడులకు దిగింది.

ALSO READ: మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

దీనికి ప్రతీకారంగా గల్ఫ్‌ దేశాలపై దాడులు చేసినట్లు ఐఆర్‌జీసీ వెల్లడించింది. కువైట్‌లోని అల్ సలేమ్, బహ్రెయిన్‌లోని ఈసా వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు తెలిపింది.  హర్మూజ్ జలసంధి భద్రతకు ముప్పు వాటిల్లితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×