E-Paper
Advertisement

Iran War: యుద్ధం ముదిరింది.. భారత్‌కు వెళ్లాల్సిన విమానంపై అమెరికా దాడి.. యుద్ధం చర్య అన్న ఇరాన్

Iran War: యుద్ధం ముదిరింది.. భారత్‌కు వెళ్లాల్సిన విమానంపై అమెరికా దాడి.. యుద్ధం చర్య అన్న ఇరాన్
Advertisement

Iran War: ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రమైంది. ఓ వైపు చర్చలు జరుగుతుండగానే మరోవైపు దాడులకు తెగ దిగుతున్నాయి. ఇరాన్‌ నుంచి భారత్‌కు రావాల్సిన ఓ విమానంపై దాడి చేసింది అమెరికా. మానవతా సహాయం కింద మహాన్ ఎయిర్‌కు చెందిన ఈ విమానం మందులు, వైద్య సామాగ్రిని కోసం న్యూఢిల్లీకి బయలుదేరాల్సి ఉంది. ఈ ఘటనపై ఇరాన్ మండిపడింది. ఇది ముమ్మాటికీ యుద్ధం చర్యగా వర్ణించింది.

భారత్‌కు వెళ్లాల్సిన విమానంపై దాడి.. ఖండించిన ఇరాన్

Advertisement

ఇరాన్ యుద్దం మొదలైన తర్వాత ఊహించని పరిణామం రాత్రి చోటు చేసుకుంది. భారత్ బయలుదేరడానికి సిద్ధమైన ఇరాన్‌కి చెందిన పౌర విమానంపై అమెరికా-ఇజ్రాయెల్‌ దాడి చేశాయి. ఈ ఘటన మషద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని ఇరాన్ మీడియా తెలిపింది. ఈ దాడి వెనుక అమెరికా-ఇజ్రాయెల్ ఉందని ఆరోపించింది.

మహాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం.. మందులు, అవసరమైన వైద్య సామాగ్రిని మానవతా సహాయం కింద వివిధ దేశాల నుంచి ఇరాన్‌కు రవాణా చేస్తోంది. ఈవారం లేదా వచ్చే వారం ఈ విమానం భారత్‌కు రావాల్సివుంది.  నష్టం తీవ్రత, ప్రాణనష్టం జరిగిందా? దాడి సమయంలో విమానం టేకాఫ్ కోసం సిద్ధమవుతోందా? అనే వివరాలు అస్పష్టంగా ఉన్నాయి. ఈ ఘటనపై ఇరాన్‌ పౌర విమానయాన శాఖ తీవ్రంగా ఖండించింది.

Advertisement

మిస్సైళ్ల దాడిలో దెబ్బతిన్న మహాన్ విమానం, యుద్ధ చర్యేనన్న ఇరాన్

మానవతా సాయాన్ని తరలించే పౌర విమానాలను లక్ష్యంగా చేసుకోవడంపై ఇరాన్ మండిపడింది. ఇది ముమ్మాటికీ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది. దీన్ని యుద్ధ చర్యగా వర్ణించిన ఇరాన్, బాధ్యులపై విచారణ జరపాలని అంతర్జాతీయ సంస్థలకు పిలుపు ఇచ్చింది. అయితే ఈ దాడిపై అమెరికా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఈ ఘటన నేపథ్యంలో వాషింగ్టన్- టెహ్రాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత పెంచుతుందని భావిస్తున్నారు అంతర్జాతీయ నిపుణులు. ఇరాన్‌కు చెందిన మహాన్ ఎయిర్.. ఐఆర్‌జిసితో సంబంధాలున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఇరాన్ అంతటా గగనతలం, నౌకా మార్గాలు, కీలక మౌలిక సదుపాయాల విషయంలో ఒత్తిడికి గురవుతోంది. ఈ తరుణంలో ఢిల్లీకి వెళ్లనున్న సహాయ సామగ్రికి సంబంధించిన విమానాన్ని లక్ష్యంగా చేసుకున్నారనే ఆరోపణలు భారతలో కాకుండా అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌లో కొత్త ఆందోళనలను రేకెత్తించే అవకాశం ఉంది.

ALSO READ: ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఖర్గ్ ద్వీపంతోపాటు చమురు కూడా స్వాధీనం చేసుకుంటాం

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×