E-Paper
Advertisement

India-Pakistan War: ఇండియాతో వార్.. పాక్‌ ఆర్థిక వ్యవస్థ కుదేలు, దయచేసి ఆదుకోవాలంటూ

India-Pakistan War: ఇండియాతో వార్.. పాక్‌ ఆర్థిక వ్యవస్థ కుదేలు, దయచేసి ఆదుకోవాలంటూ
Advertisement

India-Pakistan War: దాయాది దేశం పాకిస్తాన్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నచందంగా మారింది. భారత్‌తో కయ్యానికి కాలు దువ్విన పాక్, భారీ మూల్యం చెల్లించుకుంటోంది. ఫలితంగా నిధుల్లేక కటకలలాడు తోంది. ఫలితంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. తమ దేశానికి సాయం చేయాలని అంతర్జాతీయ భాగస్వాములను వేడుకుంటోంది. ఈ విషయాన్ని పాక్ ఆర్థిక వ్యవస్థ విభాగం అధికారులు బయట పెట్టారు.

యద్ధానికి దిగడమే దాని పర్యావసనాలు ఎంత దారుణంగా ఉంటాయనేది దాయాది దేశం పాకిస్తాన్ కు ఇప్పుడిప్పుడే తెలిసి వస్తుంది. తొలుత మనం బలంగా ఉండాలి. ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కోవాలి. లేకుంటే ప్రత్యర్థులు అమాంతంగా మిగేస్తారు. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అంతే. పహల్‌గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌కు భారత్ చెప్పాల్సిన వన్నీ చెప్పింది. కొందరు అండ చూసుకుని రెచ్చిపోయింది.

Advertisement

నోరు జారి బుక్కైన పాక్

ఆదేశ నేతలు తమ మాటలకు పదునుపెట్టారు. తొలుత ఆదేశం వనరులపై బలంగా దెబ్బకొట్టింది భారత్. అయినా వెనక్కి తగ్గకుండా నువ్వెంత అంటే నువ్వెంత అనేస్థాయికి చేరింది. అక్కడి అతివాదుల అండ చూసుకుని రెచ్చిపోయింది. పైగా కయ్యానికి కాలు దువ్వింది. సరిహద్దు వెంబడి దూకుడు ప్రదర్శించింది. ఫలితంగా సరిహద్దు గ్రామాల పౌరులపై క్షిపణులను ప్రయోగించింది. వాటిని ధీటుగా ఎదుర్కొన్న భారత్, తిప్పికొట్టింది.

Advertisement

గడిచిన మూడు నాలుగురోజులుగా పాకిస్తాన్ స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ నిలిపివేసింది.  దీంతో అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెబుతోంది.  అక్కడి కంపెనీల సూచీలు నేలబారు చూశాయి. ఈ పరిస్థితి వస్తుందని అక్కడి పాలకులు ముందుగానే ట్రేడింగ్‌ను నిలివేసింది. దీంతో నిధులకు కష్టాలు మొదలయ్యాయి.

ALSO READ: మాకు సంబంధం లేదు.. భారత్-పాక్ యుద్ధంపై అమెరికా ఉపాధ్యక్షుడు ప్రకటన

ప్లీజ్ సాయం చేయరంటూ..

తాజాగా పాకిస్థాన్ అసలు గుట్టు బయటపడింది. భారత్‌ దెబ్బకు తమ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని ఎక్స్ వేదికగా వెల్లడించింది దాయాది దేశం పాకిస్థాన్. శత్రువు దాడులతో భారీ నష్టాలు వచ్చాయని ప్రస్తావించింది. తమ దేశానికి మరిన్ని లోన్లు ఇవ్వాలని అంతర్జాతీయ పార్టనర్స్, ముఖ్యంగా ప్రపంచబ్యాంకును కోరింది.

ఓ వైపు యుద్ధ పరిస్థితులు.. మరోవైపు స్టాక్ మార్కెట్ పడిపోవడం వల్ల తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయామని రాసుకొచ్చింది. ఈ క్రైసిస్ నుంచి గట్టెక్కించేందుకు సాయం చేయాలంటూ పాకిస్తాన్ ఆర్థిక వ్యవహారాల విభాగం ఎక్స్‌లో ప్రస్తావించింది.

పాక్ పాలకుల వ్యవహారశైలిపై ఆదేశ ప్రజలు మండిపడుతున్నారు.  పాలకులకు ముందస్తు చూపు లేదా? యుద్ధంలోకి దిగిన తర్వాత ఆర్థిక సంక్షోభమంటూ చెప్పడమేంటని రుసరుసలాడుతున్నారు.  ఇలాంటి సమస్యలు ఎదురవుతాయని ఏ మాత్రం పట్టించుకోకుండా కయ్యానికి ఏ విధంగా కాలుదువ్వారని అంటున్నారు.  దీనివల్ల ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావం పడిందని చిన్నచిన్న వ్యాపారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గండం నుంచి దాయాది దేశం ఎలా గట్టెక్కుతుందో చూడాలి.

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×