E-Paper
Advertisement

Pakistan Election Results: పాక్ ఎన్నికల ఫలితాల్లో ఊహించని ట్విస్ట్.. వారిదే హవా!

Pakistan Election Results: పాక్ ఎన్నికల ఫలితాల్లో ఊహించని ట్విస్ట్.. వారిదే హవా!
Advertisement
Pakistan Election Results Today

Pakistan Election 2024 Results:

పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్.. గురువారం బాంబు పేలుళ్లు, భారీ హింస మధ్య ముగిసింది. ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. కాగా.. ఇమ్రాన్ ఖాన్ కు సంబంధించిన పార్టీ.. పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (PTI) పార్టీపై, ఆ పార్టీ గుర్తు బ్యాట్ పై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. దాంతో పీటీఐ అభ్యర్థులు.. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగారు. పాకిస్థాన్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవ్వగా.. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ముందంజలో ఉన్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. చాలా స్థానాల్లో స్వతంత్రులే ఊహించని విజయాలు సాధిస్తున్నట్లు పేర్కొంది.

Advertisement

కాగా.. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీతో పాటు నాలుగు ప్రావిన్సుల శాసనసభలకు గురువారం ఎన్నికలు జరిగాయి. పోలింగ్ సందర్భంగా అక్కడక్కడా బాంబు పేలుళ్లు, భారీ హింస చోటుచేసుకుంది. ఈ ఘటనల మధ్య పోలింగ్ ముగిసింది. పోలింగ్ పూర్తయిన 11 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలి ఫలితంలో పీటీఐ అభ్యర్థి విజయం సాధించినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే అక్కడ ముగ్గురు పీటీఐ స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించినట్లు తెలుస్తోంది.

Read More : ‘భారత్ తెలివిగా వ్యవహరిస్తోంది’.. ఇండియాపై హేలీ సంచలన వ్యాఖ్యలు..!

Advertisement

ఇమ్రాన్ ఖాన్ జైల్ లో ఉండటంతో.. మాజీ ప్రధాని, పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N)పార్టీ అభ్యర్థులే అత్యధిక స్థానాల్లో గెలుస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ.. అనూహ్యంగా ఇమ్రాన్ ఖాన్ మద్దతు దారులే గెలుస్తుండటంతో.. పాకిస్థాన్ తదుపరి ప్రధాని ఎవరు అవుతారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. నేటి మధ్యాహ్నానికి పూర్తిస్థాయిలో ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.

ఎన్నికలకు ఒకరోజు ముందు.. బుధవారం బలూచిస్థాన్ లో జరిగిన ఉగ్రదాడితో పాక్ ఉలిక్కి పడింది. ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా.. పోలింగ్ సమయంలో మొబైల్, ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. పీపీపీ సహా పలు రాజకీయ పార్టీలు మాత్రం.. రిగ్గింగ్ కోసమే ఈ సేవల్ని నిలిపివేశారని ఆరోపించాయి. పోలింగ్ సమయంలోనూ భారీగా హింస చెలరేగింది. చాలా ప్రాంతాల్లో సాయుధ మూకలు దాడులు చేశాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్, ఇతర ప్రావిన్సుల్లో జరిగిన దాడులలో 10 మంది భద్రతా సిబ్బంది మృతి చెందారు. మరో ఇద్దరు పౌరులు సైతం ప్రాణాలు కోల్పోయారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×