E-Paper
Advertisement

Houthi Rebels | అమెరికా నౌకపై దాడి చేసిన హౌతీ రెబెల్స్.. ఎవ్వరినీ వదిలేది లేదని వార్నింగ్!

Houthi Rebels | ఎర్ర సముద్రంలో హౌతీ విద్రోహులు మరోసారి రెచ్చిపోయారు. అమెరికాకు చెందిన కంటైనర్ షిప్ గిబ్రాల్టర్‌ ఈగల్‌పై హౌతీలు బాలిస్టిక్ మిసైల్స్‌తో దాడులు చేశారు. ఈ దాడుల తరువాత షిప్‌లో మంటలు చెలరేగినట్లు సమాచారం.

Houthi Rebels | అమెరికా నౌకపై దాడి చేసిన హౌతీ రెబెల్స్.. ఎవ్వరినీ వదిలేది లేదని వార్నింగ్!
Advertisement

Houthi Rebels | ఎర్ర సముద్రంలో హౌతీ విద్రోహులు మరోసారి రెచ్చిపోయారు. అమెరికాకు చెందిన కంటైనర్ షిప్ గిబ్రాల్టర్‌ ఈగల్‌పై హౌతీలు బాలిస్టిక్ మిసైల్స్‌తో దాడులు చేశారు. ఈ దాడుల తరువాత షిప్‌లో మంటలు చెలరేగినట్లు సమాచారం. అయితే షిప్‌లో ఉన్న సిబ్బందికి ఎటువంటి ప్రాణ హాని కలుగలేదని.. షిప్‌లో కూడా భారీ నష్టం కలుగలేదని అమెరికా అధికారులు తెలిపారు. ఈ దాడి తామే చేసినట్లు హౌతీ రెబెల్స్ ప్రకటించారు.

హౌతీ తిరుగుబాటుదారుల ప్రతినిధి యహ్య సరీ ఒక వీడియో ప్రకటనలో మాట్లాడుతూ.. ”అమెరికా, బ్రిటిష్‌కు చెందిన యుద్ధనౌకలు మా దేశంపై దాడి చేశాయి. “వారి యుద్ధ నౌకలను మేము టార్గెట్ చేస్తాం. అవి మా శత్రులక్ష్యాలు,” అని యహ్య సరీ చెప్పారు.

Advertisement

గత కొంతకాలంగా హౌతీ రెబెల్స్ ఎర్ర సముద్రంలో వాణిజ్య కంటైనర్ షిప్‌లను లక్ష్యంగా చేసుకొని డ్రోన్ మిసైల్స్‌తో దాడులు చేస్తున్నాయి. గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఇజ్రాయెల్ ఆపేయాలని వారి డిమాండ్. హౌతీలను కట్టడి చేసేందుకు అమెరికా, బ్రిటన్ ఎర్రసముద్రంలో యుద్ధనౌకలను మోహరించాయి. ఇటీవల యెమెన్ దేశంలోని హౌతీ రెబెల్స్ ఆయుధ స్థావరాలపై అమెరికా, బ్రిటన్ వరుసగా దాడులు చేశాయి.

అయినా హౌతీ విద్రోహులు వెనక్కు తగ్గేది లేదని చెబుతున్నారు. గాజాలో అమాయక పౌరులను చంపుతున్న ఇజ్రాయెల్‌ని కట్టడి చేసేంత వరకూ దాడులు చేస్తూనే ఉంటామని.. ఇజ్రాయెల్‌ను సమర్థించే ఎవ్వరినీ వదిలేది లేదని హౌతీ రెబెల్స్ వార్నింగ్ ఇచ్చారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×