E-Paper
Advertisement

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో తల్లీకూతుళ్లు మృతి, పలువురికి గాయాలు

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో తల్లీకూతుళ్లు మృతి, పలువురికి గాయాలు
Advertisement

Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మంచిర్యాల రెడ్డి కాలనీకి చెందిన తల్లీకూతుళ్లు మృతి చెందారు. విశ్రాంత సింగరేణి కార్మికుడు పి. విఘ్నేశ్ రమాదేవి దంపతులు, చిన్న కుమార్తె తేజస్వి గృహప్రవేశం కోసం అమెరికా వెళ్లారు. శుక్రవారం పెద్ద కుమార్తె కుమారుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి శనివారం తిరిగి వస్తుండగా , వారు ప్రయాణిస్తున్న కారు టిప్పర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రమాదేవి, ఆమె కుమార్తె తేజస్వి అక్కడికక్కడే మృతిచెందగా, మిగతా కుటుంబసభ్యులు తీవ్రంగా గాయపడ్డారు.

పూర్తి వివరాల్లోకి వెళితే..
అమెరికాలో మంచిర్యాల రెడ్డి కాలనీలో ఒక కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో తల్లి రమాదేవి (52) ఆమె చిన్న కుమార్తె తేజస్వి (32 సంవత్సరాలు) అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన చికాగో సమీపంలో శనివారం ఉదయం జరిగింది. విశ్రాంత సింగరేణి కార్మికుడు విఘ్నేశ్ ఆయన భార్య రమాదేవి ఇటీవల అమెరికాకు వెళ్లారు. వారి ఇద్దరు కుమార్తెలు – పెద్ద కుమార్తె శ్రావంతి, చిన్న కుమార్తె తేజస్వి – అమెరికాలో స్థిరపడ్డారు. తేజస్వి భర్త కిరణ్ కుమార్, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement

అయితే ఈ కుటుంబం అక్టోబర్ 18న అమెరికాకు చేరుకుంది. తేజస్వి కొత్త ఇంటికి గృహప్రవేశం చేసుకుంది. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత, శుక్రవారం వారు పెద్ద కుమార్తె శ్రావంతి కుమారుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లారు. ఆ వేడుకలు ముగిసిన తర్వాత, శనివారం ఉదయం తిరిగి వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న కారును ఒక టిప్పర్ ట్రక్ ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో రమాదేవి, తేజస్వి అక్కడికక్కడే మరణించారు. మిగతా కుటుంబ సభ్యులు – విఘ్నేశ్, కిరణ్ కుమార్, తేజస్వి ఇద్దరు పిల్లలు – తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Also Read: పవన్ కోసం వర్మ జీరో..? ఆ ఆడియో ఎలా లీకైంది..

Advertisement

ఈ ఘటనపై అమెరికా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దీని ప ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×