E-Paper
Advertisement

USA: భారత్‌ చుక్కల మందుతో కంటిచూపు కోల్పోయిన 55 మంది

USA: భారత్‌ చుక్కల మందుతో కంటిచూపు కోల్పోయిన 55 మంది
Advertisement

USA: భారత్‌లో తయారైన దగ్గుమందు కారణంగా జాంబియాలో 66 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా ఇటువంటి ఘటన మరొకటి చోటుచేసుకుంది. భారత్‌లో తయారైన కంటి చుక్కల మందు వల్ల అగ్రరాజ్యం అమెరికాలో కొందరు కంటిచూపు కోల్పోవడమేగాక.. ఓ మరణం కూడా సంభవించింది.

తమిళనాడులోని చెన్నైకి చెందిన గ్లోబల్ ఫార్మా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ చుక్కల మందును తయారు చేసింది. ఈ డ్రాప్స్‌ను ఉపయోగించి 12 రాష్ట్రాల్లో దాదాపు 55 మంది కంటిచూపును కోల్పోయారు. అలాగే ఓ వ్యక్తి మృతి చెందాడు. దీంతో అమెరికా ఆ చుక్కల మందుపై ఆంక్షలు విధించింది. వైద్యులు, వినియోగదారులు దానిని ఉపయోగించవద్దని హెచ్చరించింది.

Advertisement

ఈక్రమంలో ఔషధ నియంత్రణ సంస్థ గ్లోబల్ ఫార్మా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై తనిఖీలు నిర్వహించింది. చుక్కల మందు తయారీపై సస్పెన్షన్ విధించింది. యూఎస్‌కు పంపించిన బ్యాచ్‌లకు చెందిన నమూనాలను .. దాని తయారీకి ఉపయోగించిన ముడిపదార్థాలను అధికారులు సేకరించి పరిశోధనలు చేస్తున్నారు.

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×