E-Paper
Advertisement

Donald Trump: ఎట్టకేలకు ట్రంప్ అంగీకారం.. హ్యారిస్‌తో డిబేట్‌కు సై

Donald Trump: ఎట్టకేలకు ట్రంప్ అంగీకారం.. హ్యారిస్‌తో డిబేట్‌కు సై
Advertisement

Presidential Debate: రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు తన మనసు మార్చుకున్నారు. డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్‌తో డిబేట్‌కు సై అన్నారు. ఆమెతో సంవాదానికి తాను సిద్ధమని ప్రకటించారు. ఇది వరకే డొనాల్డ్ ట్రంప్.. ప్రస్తుత అధ్యక్షుడు, మొన్నటి వరకు డెమోక్రాట్ల అభ్యర్థిగా ఉన్న జో బైడెన్‌తో డిబేట్ చేశాడు. సీఎన్ఎన్ నిర్వహించిన ఆ డిబేట్‌లో జో బైడెన్ చురుకుగా స్పందించలేదు. జ్ఞాపకశక్తి క్షీణిస్తున్నదని, కదలికల్లోనూ చురుకుదనం లేదనే అభిప్రాయాన్ని డెమోక్రాట్లు వచ్చారు. ఆ తర్వాతే డెమోక్రాట్ల అభ్యర్థిగా జో బైడెన్ వద్దనే అభిప్రాయం బలంగా ఏర్పడింది. ఆ తర్వాత అనివార్యంగా జో బైడెన్ తన అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ను అభ్యర్థిత్వానికి మద్దతు పలికారు.

ఇది వరకు కమలా హ్యారిస్‌ను, డొనాల్డ్ ట్రంప్‌ను ఓ చానెల్ తమ నెట్‌వర్క్‌లో డిబేట్‌కు రావాలని ఆహ్వానించింది. అందుకు కమలా హ్యారిస్ అంగీకారం తెలిపింది. కానీ, డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ఆమె డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా ఇంకా ధ్రువీకరణ కాలేదని, ఆమెతో డిబేట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఆమెకు సొంత పార్టీలోనే ఆదరణ లేదని, బరాక్ ఒబామా కూడా ఆమెకు మద్దతు ఇవ్వడం లేదని ఆరోపించారు. కానీ, ఆ తర్వాత ఒబామా దంపతులు ఆమెకు ఫోన్ చేసి ఫుల్ సపోర్ట్ ప్రకటించారు.

Advertisement

Also Read: తాజ్ మహల్‌లో గంగాజలం సమర్పించిన వీడియో వైరల్.. ఇద్దరు అరెస్ట్

అభ్యర్థిత్వానికి కావాల్సిన ఓట్లను సాధించుకున్న కమలా హ్యారిస్‌తో ఇప్పుడు డిబేట్ చేయడానికి డొనాల్డ్ ట్రంప్ అంగీకారం తెలిపారు. తన ట్రుత్ సోషల్‌లో ఈ మేరకు ట్రంప్ పోస్టు పెట్టారు. ఫాక్స్ న్యూస్‌ నుంచి తనకు ఆహ్వానం అందిందని వివరించారు. ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో డిబేట్ చేయడానికి తాను సిద్ధమని ప్రకటించారు. సెప్టెంబర్ 4వ తేదీన డిబేట్ జరుగుతుందని పేర్కొన్నారు. ఏబీసీ చానెల్ వేదికగా డిబేట్ షెడ్యూలైందని, కానీ, జో బైడెన్ పాల్గొనలేని కారణంగా అది రద్దయిపోయిందని వివరించారు.

Advertisement

హ్యారిస్‌తో డిబేట్ సెప్టెంబర్ 4వ తేదీన గ్రేట్ కామన్వెల్త్ ఆఫ్ పెన్సిల్వేనియాలో జరుగుతుందని ట్రంప్ తెలిపారు. డిబేట్ మారేటర్లుగా బ్రెట్ బాయర్, మార్థా మెక్ కల్లం ఉంటారని వివరించారు. జో బైడెన్‌తో జరిగిన డిబేట్‌తో ఏ రూల్స్ ఉన్నాయో.. అవే రూల్స్ ఇందులోనూ ఉంటాయని చెప్పారు. అయితే, గత డిబేట్‌లో వీక్షకులు లేరని, ఈ డిబేట్‌ మాత్రం ఫుల్ ఆడియెన్స్ ముందర జరుగుతుందని పేర్కొన్నారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×