E-Paper
Advertisement

Dell: నష్టాల్లో డెల్.. 6వేల మందికి ఉద్వాసన

Dell: నష్టాల్లో డెల్.. 6వేల మందికి ఉద్వాసన
Advertisement

Dell: కరోనా సంక్షోభంలో అన్ని రంగాలు నష్టాల్లోకి జారుకున్నప్పటికీ ఒక్క ఐటీ రంగం మాత్రం తట్టుకొని నిలబడింది. అలాంటిది ఇప్పుడు మాంద్యం దెబ్బకు విలవిలలాడుతోంది. ఆర్థిక నష్టాలతో దిగ్గజ కంపెనీలు సైతం దివాలా తీస్తున్నాయి. పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుండగా.. ఇప్పుడు పీసీ తయారీ సంస్థ డెల్ టెక్నాలజీ వంతు వచ్చింది.

మొత్తం 6,650 మంది ఉద్యోగులను సాగనంపుతున్నట్లు డెల్ టెక్నాలజీస్ ప్రకటించింది. ఇది తమ కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 5 శాతానికి సమానమని తెలిపింది. ఆర్థిక నష్టాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ వెల్లడించింది.

Advertisement

కరోనా కాలంలో ఉద్యోగులంతా వర్క్ ఫ్రమ్ హోం చేయడం.. విద్యార్థులు ఆన్‌లైన్ క్లాస్‌లు వినడంతో పీసీలకు డిమాండ్ పెరిగింది. దీంతో జోరుగా పీసీల విక్రయాలు జరిగాయి. అయితే ప్రస్తుతం కరోనా తగ్గి పరిస్థితులు మెరుగుపడడంతో పీసీల విక్రయాలు గణనీయంగా తగ్గాయి. దీంతో పీసీ తయారీ కంపెనీలకు నష్టాలు తప్పడం లేదు.

డెల్ టెక్నాలజీస్‌కు మొత్తం ఆదాయంలో 55 శాతం పీసీల నుంచే వస్తోంది. ప్రస్తుతం డెల్ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన దాదాపు 37 శాతం పడిపోయాయి. దీంతో నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×