E-Paper
Advertisement

Bangladesh Prime Minister: భారత్‌కు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా..రెండు రోజులపాటు పర్యటన

Bangladesh Prime Minister: భారత్‌కు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా..రెండు రోజులపాటు పర్యటన
Advertisement

Prime Minister of Bangladesh to India: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు భారతదేశంలో పర్యటించనున్నారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత న్యూఢిల్లీకి వచ్చిన మొదటి విదేశీ అతిథి ప్రధానిగా షేక్ హసీనా కావడం విశేషం. అంతకుముందు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ఆమె కూడా హాజరైన సంగతి తెలిసిందే.

ప్రధాని మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భారత్‌లో పర్యటించాలని బంగ్లా ప్రధాని షేక్ హసీనాను మోదీ ఆహ్వానించారు. అయితే బంగ్లా ప్రధాని వచ్చే నెలలో చైనాకు అధికారిక పర్యటనకు వెళ్లనున్నారు. ఈ తరుణంలో ఆమె న్యూఢిల్లీ పర్యటనపై పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది.

కీలక సమావేశం
Advertisement

ప్రధాని నరేంద్ర మోదీతో బంగ్లా ప్రధాని షేక్ హసీనా కీలక సమావేశంలో పాల్గొననున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో భాగంగా ద్వైపాక్షిక అంశాలతో పాటు ప్రాంతీయ అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్ ఖర్లను సైతం బంగ్లా ప్రధాని షేక్ హసీనా కలవనున్నట్లు తెలుస్తోంది.

Also Read: వియత్నాంతో పుతిన్‌ భేటీ..విక్ట‌రీ డే సంబ‌రాల‌కు ఆహ్వానం

Advertisement

బంగ్లాదేశ ప్రధాని చైనా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో చైనా పర్యటనుకు సంబంధించిన అంశాలను కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా ద్వైపాక్షిక సమస్యలపై వాణిజ్యంతోపాటు కనెక్టివిటీ సమస్యలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా భూటాన్, నేపాల్‌తో వ్యాపారం చేసేందుకు బంగ్లాదేశ్‌కు మార్గం కల్పించే అంశంపై చర్చలు కొనసాగున్న సంగతి తెలిసిందే. కాగా, భారత్, బంగ్లా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం  కుదిరే అవకాశం ఉంది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×