E-Paper
Advertisement

Bangladesh MP Murder: కోల్‌క‌తాలో బంగ్లాదేశ్ ఎంపీ హత్య.. ముగ్గురు అరెస్ట్

Bangladesh MP Murder: కోల్‌క‌తాలో బంగ్లాదేశ్ ఎంపీ హత్య.. ముగ్గురు అరెస్ట్
Advertisement

Bangladesh MP Murder: బంగ్లాదేశ్ ఎంపీ కోల్‌క‌తాలో దారుణ హత్యకు గురయ్యారు. కోల్‌క‌తాలోని న్యూటౌన్ లో బంగ్లాదేశ్ అధికార పార్టీకి చెందిన ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ ను గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం దారుణంగా హత్య చేశారు. ఎంపీ అన్వరుల్ మే 12న మెడికల్ చెకప్ కోసం బంగ్లాదేశ్ నుంచి ఇండియా వచ్చినట్లు తెలుస్తోంది.

అజీమ్ బంగ్లాదేశ్ లోని జెనైదా నియోజకవర్గానికి ఎంపీగా ఉన్నారు. కోల్ కతా పోలీసుల వివరాల ప్రకారం ఎంపీ అన్వరుల్ అజీమ్ హత్యకు గురైనట్లు భావించిన భవనంలో రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం దీనిపై ఫోరెన్సిక్ విచారణ జరుగుతోంది. నిందితులు హత్య చేసి మృత దేహాన్ని సమీపంలోనే పడేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read:ఇరాన్ అధ్యక్షుడి మృతి విషయంలో స్పందించిన అమెరికా.. ఏం చెప్పిందంటే..?

ఇదిలా ఉంటే అన్వరుల్ హత్యను బంగ్లాదేశ్ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ ధృవీకరించారు. అధికార పార్టీ ఎంపీని కోల్ కతాలో ముగ్గురు వ్యక్తులు హత్య చేశారని..వారు బంగ్లాదేశీయులేనని చెప్పారు. హత్య కేసులో భారత పోలీసులు సహకరిస్తున్నారని పేర్కొన్నారు. మే 12న వైద్య చికిత్సల కోసం ఎంపీ న్యూఢిల్లీ వచ్చారు. అనంతరం తన స్నేహితుడు గోపాల్ బిస్వాస్ నివాసానికి వచ్చారు. తర్వాత ఆయన అదృశ్యం అయ్యారు. దీంతో ఆయన స్నేహితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది.

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×